సందీప్ కిషన్ తో దర్శకుడు వంశీకృష్ణ

- May 15, 2017 , by Maagulf
సందీప్ కిషన్ తో దర్శకుడు వంశీకృష్ణ

'దొంగాట', 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' వంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న వంశీకృష్ణ . ఇప్పుడీ దర్శకుడి చేతిలో మరో సినిమా పడింది. హీరో సందీప్‌ కిషన్‌ తో ఓ సినిమా చేయబోతున్నాడు వంశీ కృష్ణ. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్‌ కథ అందిస్తున్నట్లు దర్శకుడు వంశీకృష్ణ వెల్లడించాడు, ప్రసన్న కుమార్‌ గతంలో 'సినిమా చూపిస్త మావ', 'నేను లోకల్‌' చిత్రాలకు కథను అందించిన సంగతి తెల్సిందే. ఆర్‌డీజీ ప్రొడక్షన్‌ ప్రై.లి పతాకంపై రూపేశ్‌ డి గోహిల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిజార్‌ షఫి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు.
ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో నక్షిత్రం చేస్తున్నాడు సందీప్ కిషన్ ఈ సినిమా విడుదలైన వెంటనే కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ కొత్త సినిమా హీరోయిన్ ఎవరన్నది ఇంకా తెలియాల్సివుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com