ఆంధ్రప్రదేశ్ లో కార్మికుల భద్రతకు కొత్త చట్టం
- May 15, 2017
కార్మికుల భద్రత, కాలుష్య రహిత పరిశ్రమల కోసం కొత్త చట్టాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం ఏర్పాటైన మంత్రి వర్గ ఉప సంఘం వెలగపూడి సచివాలయంలో సోమవారం సమావేశమైంది. పరిశ్రమలు, కార్మికుల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఆయా శాఖల అధికారులతో కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, అటవీ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు, పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథరెడ్డి ప్రాథమిక చర్చలు జరిపారు. పూర్తిస్థాయి కార్యాచరణ కోసం మరో దఫా చర్చలు జరపనున్నట్లు మంత్రులు విలేకరులకు చెప్పారు. రెడ్ కేటగిరీలో ఉన్న పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవడం, కాలుష్య నివారణ అంశాలపై యాజమాన్యాలను చైతన్యపరచాలని నిర్ణయించినట్లు తెలిపారు. మొగల్తూరు తదితర ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాలు ప్రభుత్వాన్ని కదిలించాయని, ఇకపై ప్రమాదాలు, కాలుష్యం లేకుండా పరిశ్రమలు నడిచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పితాని తెలిపారు. రాష్ట్రానికి అనేక పరిశ్రమలు రావాలని, అయితే అవి కాలుష్యరహితంగా ఉండాలని ఇదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
తాజా వార్తలు
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..







