ఆంధ్రప్రదేశ్ లో కార్మికుల భద్రతకు కొత్త చట్టం
- May 15, 2017
కార్మికుల భద్రత, కాలుష్య రహిత పరిశ్రమల కోసం కొత్త చట్టాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం ఏర్పాటైన మంత్రి వర్గ ఉప సంఘం వెలగపూడి సచివాలయంలో సోమవారం సమావేశమైంది. పరిశ్రమలు, కార్మికుల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఆయా శాఖల అధికారులతో కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, అటవీ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు, పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథరెడ్డి ప్రాథమిక చర్చలు జరిపారు. పూర్తిస్థాయి కార్యాచరణ కోసం మరో దఫా చర్చలు జరపనున్నట్లు మంత్రులు విలేకరులకు చెప్పారు. రెడ్ కేటగిరీలో ఉన్న పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవడం, కాలుష్య నివారణ అంశాలపై యాజమాన్యాలను చైతన్యపరచాలని నిర్ణయించినట్లు తెలిపారు. మొగల్తూరు తదితర ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాలు ప్రభుత్వాన్ని కదిలించాయని, ఇకపై ప్రమాదాలు, కాలుష్యం లేకుండా పరిశ్రమలు నడిచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పితాని తెలిపారు. రాష్ట్రానికి అనేక పరిశ్రమలు రావాలని, అయితే అవి కాలుష్యరహితంగా ఉండాలని ఇదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం







