రమదాన్ కు ముందే వినియోగదారులను రక్షణ కోసం తనిఖీ ప్రచారం ప్రారంభం
- May 16, 2017
రియాద్:రాబోయే పవిత్ర నెల రమదాన్ కోసం సిద్ధపడే ముందు మార్కెట్లో వివిధ వస్తువుల లభ్యత తనిఖీ మరియు నకిలీ వస్తువుల అమ్మకం నిరోధించడానికి చిల్లర దుకాణాల తనిఖీ ప్రచారం వాణిజ్య మరియు ఇన్వెస్ట్మెంట్ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది .దుకాణాలలో ప్రదర్శించబడే అన్ని వస్తువులు ధర ట్యాగ్లను కలిగి ఉండేలా తనిఖీ అధికారులు పరిశీలిస్తారు.మరియు వారి గడువు తేదీ ముగిసిన వస్తువులను విక్రయించబడకుండా చర్యలు తీసుకొంటారు.ఆయా ధర ట్యాగ్లు దుకాణాలలో జాతీయ నగదు రిజిస్ట్రేషన్ జారీ చేసిన రసీదులతో అనుగుణంగా ఉండాలి. అమ్మకాల ప్రోత్సాహకాలు నిజమని మరియు వినియోగదారులను మోసం చేయలేదని ఇన్స్పెక్టర్లు కూడా నిర్ధారిస్తారు. ఏదైనా ఉల్లంఘనకు వ్యతిరేకంగా వ్యాపారులు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. మొదటి రెండు రోజులు పరీక్షలను నిర్వహించడమే కాక వినియోగదారుల కోసం సాధారణంగా రమదాన్ సమయంలో కొనుగోలు చేసే అన్ని వస్తువుల మరియు ఆహార పదార్ధాల లభ్యత దుకాణాదారుడు చూపించాల్సి ఉంది. అలాగే తగిన ప్రత్యామ్నాయాలు ఏర్పాటుచేసుకోవాలి. ఏదైనా ఇబ్బంది జరిగితే, వినియోగదారుడు నేరుగా కస్టమర్ కాల్ సెంటర్ (1900) కు ఫోన్ చేయవచ్చు. వీటికి సంబంధించి పరిశీలనలను, ఫిర్యాదులను నివేదించడానికి వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా పిర్యాదు చేయవచ్చు. స్మార్ట్ ఫోన్ల ద్వారా వాణిజ్య ఉల్లంఘన నివేదికను ఉపయోగించడం ద్వారా వినియోగదారులకు మరింత అవకాశాన్ని కల్పిస్తారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







