రమదాన్ కు ముందే వినియోగదారులను రక్షణ కోసం తనిఖీ ప్రచారం ప్రారంభం

- May 16, 2017 , by Maagulf
రమదాన్ కు ముందే వినియోగదారులను రక్షణ కోసం తనిఖీ ప్రచారం ప్రారంభం

రియాద్:రాబోయే పవిత్ర నెల రమదాన్ కోసం సిద్ధపడే ముందు మార్కెట్లో వివిధ వస్తువుల లభ్యత తనిఖీ మరియు నకిలీ వస్తువుల అమ్మకం నిరోధించడానికి చిల్లర దుకాణాల తనిఖీ ప్రచారం వాణిజ్య మరియు ఇన్వెస్ట్మెంట్ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది .దుకాణాలలో ప్రదర్శించబడే అన్ని వస్తువులు ధర ట్యాగ్లను కలిగి ఉండేలా తనిఖీ అధికారులు పరిశీలిస్తారు.మరియు వారి గడువు తేదీ ముగిసిన వస్తువులను  విక్రయించబడకుండా చర్యలు తీసుకొంటారు.ఆయా ధర ట్యాగ్లు దుకాణాలలో జాతీయ నగదు రిజిస్ట్రేషన్ జారీ చేసిన రసీదులతో అనుగుణంగా ఉండాలి. అమ్మకాల ప్రోత్సాహకాలు నిజమని మరియు వినియోగదారులను మోసం చేయలేదని ఇన్స్పెక్టర్లు కూడా నిర్ధారిస్తారు. ఏదైనా ఉల్లంఘనకు వ్యతిరేకంగా వ్యాపారులు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. మొదటి రెండు రోజులు పరీక్షలను నిర్వహించడమే కాక వినియోగదారుల కోసం సాధారణంగా  రమదాన్ సమయంలో కొనుగోలు చేసే  అన్ని వస్తువుల మరియు ఆహార పదార్ధాల లభ్యత దుకాణాదారుడు చూపించాల్సి ఉంది. అలాగే తగిన ప్రత్యామ్నాయాలు ఏర్పాటుచేసుకోవాలి. ఏదైనా ఇబ్బంది జరిగితే, వినియోగదారుడు నేరుగా  కస్టమర్ కాల్ సెంటర్ (1900) కు ఫోన్ చేయవచ్చు. వీటికి సంబంధించి పరిశీలనలను, ఫిర్యాదులను నివేదించడానికి వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా పిర్యాదు చేయవచ్చు. స్మార్ట్ ఫోన్ల ద్వారా వాణిజ్య ఉల్లంఘన నివేదికను ఉపయోగించడం ద్వారా వినియోగదారులకు మరింత అవకాశాన్ని కల్పిస్తారు.

    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com