సెంటిమెంట్ ఫాలో అవుతున్న డైరెక్టర్ సుకుమార్
- May 17, 2017
లెక్కల మాస్టార్ సుకుమార్ కూడా సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్, నిర్మాతగాను ఘనవిజయం సాధించాడు. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా తెరకెక్కిన కుమారి 21ఎఫ్ సినిమాతో తొలిసారిగా నిర్మాతగా మారిన సుకుమార్, తొలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టాడు. కుమారి 21 ఎఫ్ రిలీజ్ సమయంలో ఎన్టీఆర్తో నాన్నకు ప్రేమతో సినిమా పనుల్లో ఉన్న సుక్కు.. కుమారి టీజర్ను ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేయించాడు.
దీంతో ఎన్టీఆర్ రిలీజ్ చేయటం సుకుమార్కు సెంటిమెంట్గా మారిపోయింది. అందుకే తన నిర్మాణంలో వస్తున్న రెండో సినిమా దర్శకుడు టీజర్ను కూడా ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేయించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న దర్శకుడు సినిమా టీజర్ ఈ నెల 22న ఓ ప్రముఖ హీరోగా చేతుల మీదుగా రిలీజ్ చేస్తామాని చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే ప్రముఖ హీరో ఎన్టీఆరే అని భావిస్తున్నారు. మరి నిజంగానే సుక్కు సెంటిమెంట్ ఫాలో అయి ఎన్టీఆర్తో రిలీజ్ చేయిస్తాడా..? లేక రామ్ చరణ్తో సినిమా చేస్తున్నాడు కాబట్టి చరణ్ చేతుల మీదుగా టీజర్ లాంచ్ చేయిస్తాడా..? తెలియాలంటే 22 వరకు వెయిట్ చేయాల్సిందే.
తాజా వార్తలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- 'చెక్ యువర్ హెల్త్' క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..









