సెంటిమెంట్ ఫాలో అవుతున్న డైరెక్టర్ సుకుమార్
- May 17, 2017
లెక్కల మాస్టార్ సుకుమార్ కూడా సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్, నిర్మాతగాను ఘనవిజయం సాధించాడు. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా తెరకెక్కిన కుమారి 21ఎఫ్ సినిమాతో తొలిసారిగా నిర్మాతగా మారిన సుకుమార్, తొలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టాడు. కుమారి 21 ఎఫ్ రిలీజ్ సమయంలో ఎన్టీఆర్తో నాన్నకు ప్రేమతో సినిమా పనుల్లో ఉన్న సుక్కు.. కుమారి టీజర్ను ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేయించాడు.
దీంతో ఎన్టీఆర్ రిలీజ్ చేయటం సుకుమార్కు సెంటిమెంట్గా మారిపోయింది. అందుకే తన నిర్మాణంలో వస్తున్న రెండో సినిమా దర్శకుడు టీజర్ను కూడా ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేయించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న దర్శకుడు సినిమా టీజర్ ఈ నెల 22న ఓ ప్రముఖ హీరోగా చేతుల మీదుగా రిలీజ్ చేస్తామాని చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే ప్రముఖ హీరో ఎన్టీఆరే అని భావిస్తున్నారు. మరి నిజంగానే సుక్కు సెంటిమెంట్ ఫాలో అయి ఎన్టీఆర్తో రిలీజ్ చేయిస్తాడా..? లేక రామ్ చరణ్తో సినిమా చేస్తున్నాడు కాబట్టి చరణ్ చేతుల మీదుగా టీజర్ లాంచ్ చేయిస్తాడా..? తెలియాలంటే 22 వరకు వెయిట్ చేయాల్సిందే.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







