'దళపతి' ఈ క్రేజీ కాంబినేషన్ మళ్ళీ రానుందా?
- May 18, 2017
'దళపతి' .. మణిరత్నం క్లాసిక్స్ లో ముందు వరుసలా వుండే చిత్రం. సూపర్స్టార్ రజనీకాంత్, మళయాళ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో మణిరత్నం తెరకెక్కించిన 'దళపతి' ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం మళ్లీ ఈ ఇద్దరు హీరోలతో కలిపి ఓ చిత్రం రూపొందించాలని మణిరత్నం భావిస్తున్నారట. తన వద్ద ఉన్న ఓ కథకు వీరిద్దరూ సరిపోతారని అనుకుంటున్నారట.
అయితే ఇప్పటివరకూ దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. రజనీకాంత్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న '2.0'లో నటిస్తున్నారు. దీని తర్వాత పా.రంజిత్ దర్శకత్వంలో మరో సినిమాను మొదలుపెట్టబోతున్నారు. ఒకవేళ మణిరత్నం కనుక ఆసక్తి చూపిస్తే.. ఈ కాంబినేషన్ సెట్ కావడం పెద్ద కష్టం ఏమీ కాదు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









