సిరియాలో 50 మందిని చంపిన ఐఎస్ ఉగ్రవాదులు
- May 18, 2017
సిరియాలోని హమా ప్రావిన్సులో ఐఎస్ ఉగ్రవాదులు దాడి చేసి 50కి పైగా వ్యక్తుల ప్రాణాలు తీసినట్లు ఓ మానవ హక్కుల సంస్థ వెల్లడించింది. ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అఖరెబ్, అల్ మబుజెహ్ గ్రామాల్లో గురువారం ఈ దాడి జరిగిÏంది. మృతుల్లో 15 మంది పౌరులు, 27 మంది ప్రభుత్వ మద్దతుదారులు ఉన్నారంది. ఐఎస్ ఉగ్రవాదుల్లోనూ 15 మంది మృతి చెందినట్లు పేర్కొంది. అఖరెబ్తోపాటు అల్ మబుజెహ్లో కొంత ప్రాంతాన్ని ఐఎస్ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిపింది. ఇటు సిరియా ప్రభుత్వ వార్త సంస్థ సనా.. అఖరెబ్లో 20 మంది పౌరులను ఐఎస్ హతమార్చినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..







