సిరియాలో 50 మందిని చంపిన ఐఎస్‌ ఉగ్రవాదులు

- May 18, 2017 , by Maagulf
సిరియాలో 50 మందిని చంపిన ఐఎస్‌ ఉగ్రవాదులు

సిరియాలోని హమా ప్రావిన్సులో ఐఎస్‌ ఉగ్రవాదులు దాడి చేసి 50కి పైగా వ్యక్తుల ప్రాణాలు తీసినట్లు ఓ మానవ హక్కుల సంస్థ వెల్లడించింది. ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అఖరెబ్‌, అల్‌ మబుజెహ్‌ గ్రామాల్లో గురువారం ఈ దాడి జరిగిÏంది. మృతుల్లో 15 మంది పౌరులు, 27 మంది ప్రభుత్వ మద్దతుదారులు ఉన్నారంది. ఐఎస్‌ ఉగ్రవాదుల్లోనూ 15 మంది మృతి చెందినట్లు పేర్కొంది. అఖరెబ్‌తోపాటు అల్‌ మబుజెహ్‌లో కొంత ప్రాంతాన్ని ఐఎస్‌ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిపింది. ఇటు సిరియా ప్రభుత్వ వార్త సంస్థ సనా.. అఖరెబ్‌లో 20 మంది పౌరులను ఐఎస్‌ హతమార్చినట్లు పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com