పాకిస్తాన్లోని అణు గుట్టు రట్టు
- May 18, 2017
ఉపగ్రహ సాయంతో గుర్తింపు
పొరుగుదేశం పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తున్వాలో పీర్ థాన్ పర్వతం దగ్గర్లో రహస్య అణ్వాయుధ నిల్వ కేంద్రం ఉన్నట్లు ఔట్లుక్ మేగజీన్ ఓ కథనంలో పేర్కొంది. ఉపగ్రహ చిత్రాల ద్వారా సేకరించిన సమాచారంతో ఈ విషయం వెలుగుచూసింది. భారత మిలిటరీ నిఘా వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం ఈ స్థావరం గురించి కొన్ని రోజుల ముందు వరకు ఎవరికీ తెలీదు. ఇటీవలే పాకిస్తాన్ 2,750 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగల షాహీన్–3 క్షిపణిని పరీక్షించడం తెలిసిందే.
ఈ క్షిపణికి అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం కూడా ఉంది. రహస్య స్థావరంలో షాహీన్–3 క్షిపణులను రహస్యంగా మోహరించి ఉంచినట్లు భావిస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి పంజాబ్లోని అమృత్సర్ 320 కి.మీ, చండీగఢ్ 520 కి.మీ, న్యూఢిల్లీ 720 కి.మీ దూరంలోనే ఉండటంతో భారత్కు ప్రమాదం పొంచి ఉంది. గత కొన్నేళ్లుగా పాక్ ఎన్నో రహస్య అణ్వాయుధ నిల్వ కేంద్రాలను నిర్మించిందనీ, ఉపగ్రహ చిత్రాల ద్వారా వాటిని త్వరలోనే గుర్తిస్తామని ఔట్లుక్ తెలిపింది. కాగా, భారత్కు 2,600 అణ్వాయుధాలను తయారు చేయగల సామర్థ్యం ఉందని పాకిస్తాన్ ఆరోపించింది.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







