పాకిస్తాన్లోని అణు గుట్టు రట్టు
- May 18, 2017
ఉపగ్రహ సాయంతో గుర్తింపు
పొరుగుదేశం పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తున్వాలో పీర్ థాన్ పర్వతం దగ్గర్లో రహస్య అణ్వాయుధ నిల్వ కేంద్రం ఉన్నట్లు ఔట్లుక్ మేగజీన్ ఓ కథనంలో పేర్కొంది. ఉపగ్రహ చిత్రాల ద్వారా సేకరించిన సమాచారంతో ఈ విషయం వెలుగుచూసింది. భారత మిలిటరీ నిఘా వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం ఈ స్థావరం గురించి కొన్ని రోజుల ముందు వరకు ఎవరికీ తెలీదు. ఇటీవలే పాకిస్తాన్ 2,750 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగల షాహీన్–3 క్షిపణిని పరీక్షించడం తెలిసిందే.
ఈ క్షిపణికి అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం కూడా ఉంది. రహస్య స్థావరంలో షాహీన్–3 క్షిపణులను రహస్యంగా మోహరించి ఉంచినట్లు భావిస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి పంజాబ్లోని అమృత్సర్ 320 కి.మీ, చండీగఢ్ 520 కి.మీ, న్యూఢిల్లీ 720 కి.మీ దూరంలోనే ఉండటంతో భారత్కు ప్రమాదం పొంచి ఉంది. గత కొన్నేళ్లుగా పాక్ ఎన్నో రహస్య అణ్వాయుధ నిల్వ కేంద్రాలను నిర్మించిందనీ, ఉపగ్రహ చిత్రాల ద్వారా వాటిని త్వరలోనే గుర్తిస్తామని ఔట్లుక్ తెలిపింది. కాగా, భారత్కు 2,600 అణ్వాయుధాలను తయారు చేయగల సామర్థ్యం ఉందని పాకిస్తాన్ ఆరోపించింది.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









