నో డైలాగ్స్‌.. ఓన్లీ యాక్షన్‌ అంటున్న అరుణ్‌జైట్లీ

- May 19, 2017 , by Maagulf
నో డైలాగ్స్‌.. ఓన్లీ యాక్షన్‌ అంటున్న అరుణ్‌జైట్లీ

జమ్ముకశ్మీర్‌లో నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితుల విషయాన్ని మరొకరితో చర్చించే సమస్యే లేదని ఆర్థికశాఖ మంత్రి అదనంగా రక్షణశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న అరుణ్‌జైట్లీ అన్నారు. తాము వేర్పాటువాదులతో చర్చించేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేమని, తమ ప్రధాని దృష్టి మొత్తం ప్రస్తుతం పరిస్థితులను మెరుగుపరచడమే అని చెప్పారు.

‘మా అత్యున్నత ప్రాధాన్య అంశం ప్రస్తుతం ఉన్న పరిస్థితులను మెరుగుపరచడమే’ అని ఆయన గురువారం విలేకరులతో చెప్పారు. అలాగే, జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని భర్తీ విషయాన్ని ఆయన కొట్టిపారేశారు. ‘అసలు ఇప్పటి వరకు తాను అలాంటి వార్తలేవి వినలేదని, తనకు ఆ విషయం గురించి కూడా తెలియదని చెప్పారు. హుర్రియత్‌ కాన్ఫరెన్స్‌వంటి వేర్పాటువాద సంస్థలతో చర్చించబోమని స్పష్టం చేశారు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com