ఉద్యోగార్థుల కోసం బ్యాక్‌గ్రౌండ్‌ చెక్‌ కఠినతరం

- May 19, 2017 , by Maagulf
ఉద్యోగార్థుల కోసం బ్యాక్‌గ్రౌండ్‌ చెక్‌ కఠినతరం

బంగ్లాదేశ్‌ నుంచి యూఏఈకి ఉద్యోగాల కోసం వెళ్ళేవారికి బ్యాక్‌గ్రౌండ్‌ చెక్‌ని మరింత కఠినతరం చేస్తున్నట్లు బంగ్లాదేశ్‌ రాయబారి ముహమ్మద్‌ ఇమ్రాన్‌ చెప్పారు. క్రైమ్‌ రేట్‌ తగ్గించడానికీ, అలాగే వర్క్‌ వీసా నిబంధనల్ని సరళతరం చేయడానికి కఠిన నిర్ణయాల్ని తమ ప్రభుత్వం తీసుకుంటోందని ఆయన తెలిపారు. యూఏఈలో బంగ్లాదేశీ వ్యక్తులు పలు నేరాలకు పాల్పడుతున్న దరిమిలా, బ్యాక్‌గ్రౌండ్‌ చెక్‌ విషయంలో మరింత సమర్థవంతంగా వ్యవహరించడంపై దృష్టిపెట్టినట్లు ఆయన వివరించారు. యూఏఈలో మొత్తం 700,000 నుంచి 800,000 వరకు బంగ్లాదేశీ వలసదారులు నివసిస్తున్నారు. ఎంబసీ లెక్కల ప్రకారం చూస్తే 700 నుంచి 800 మంది యూఏఈ జైళ్ళలో శిక్ష అనుభవిస్తున్నారు వివిధ నేరాలకు సంబంధించి. 2014లో ఖైదీల అప్పగింత సహా పలు విషయాలపై ఇరు దేశాల మధ్యా ఒప్పందం కుదిరింది. 2015లో యూఏఈ, ఢాకాలో వీసా సెంటర్‌ని ప్రారంభించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com