ట్రాఫిక్ ఉల్లంఘనలు 75 శాతం తగ్గాయి: అంతర్గత మంత్రి
- May 21, 2017
గత రెండు నెలల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలు 75 శాతం మేరకు క్షీణించాయని అంతర్గత మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా వెల్లడించారు. ట్రాఫిక్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన ఆయన రోడ్ల వినియోగదారులు అందరు ట్రాఫిక్ భద్రతను ప్రోత్సహించే విధంగా ప్రాముఖ్యతనిచ్చారు. ట్రాఫిక్ ప్రమాదాలు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయని ఆయన చెప్పారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను తగ్గించడానికి మరియు చట్ట అమలుకు హామీ కల్పించే విధంగా ట్రాఫిక్ ప్రవాహం మరియు భద్రత అవసరాల కోసం ప్రధాన, ఉప రహదారుల వేగ పరిమితులను ఆమోదించింది. ఈ సమావేశంలో మండలి సభ్యుల విద్యాశాఖ మంత్రి మజిద్ అల్ నౌమిమి, వర్క్స్, మునిసిపాలిటీ వ్యవహారాల మరియు అర్బన్ ప్లానింగ్ మంత్రి ఎస్సమ్ ఖలాఫ్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ టెలికమ్యూనికేషన్స్ మంత్రి కమల్ అహ్మద్ పాల్గొన్నారు. ట్రాఫిక్ భద్రతకు అనుగుణంగా వారి ప్రయత్నాలకు కౌన్సిల్ సభ్యులకు షేఖ్ రషీద్ కృతజ్ఞతలు వ్యక్తపరిచారు. చట్టం ప్రకారం అనుగుణంగా ట్రాఫిక్ జామ్లు, ప్రమాదాలు ఎదుర్కోవటానికి ట్రాఫిక్ ప్రవాహాన్ని మరియు వేగవంతమైన చర్యలను నియంత్రించడానికి అవసరమైన చర్యల ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం







