ట్రాఫిక్ ఉల్లంఘనలు 75 శాతం తగ్గాయి: అంతర్గత మంత్రి
- May 21, 2017
గత రెండు నెలల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలు 75 శాతం మేరకు క్షీణించాయని అంతర్గత మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా వెల్లడించారు. ట్రాఫిక్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన ఆయన రోడ్ల వినియోగదారులు అందరు ట్రాఫిక్ భద్రతను ప్రోత్సహించే విధంగా ప్రాముఖ్యతనిచ్చారు. ట్రాఫిక్ ప్రమాదాలు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయని ఆయన చెప్పారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను తగ్గించడానికి మరియు చట్ట అమలుకు హామీ కల్పించే విధంగా ట్రాఫిక్ ప్రవాహం మరియు భద్రత అవసరాల కోసం ప్రధాన, ఉప రహదారుల వేగ పరిమితులను ఆమోదించింది. ఈ సమావేశంలో మండలి సభ్యుల విద్యాశాఖ మంత్రి మజిద్ అల్ నౌమిమి, వర్క్స్, మునిసిపాలిటీ వ్యవహారాల మరియు అర్బన్ ప్లానింగ్ మంత్రి ఎస్సమ్ ఖలాఫ్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ టెలికమ్యూనికేషన్స్ మంత్రి కమల్ అహ్మద్ పాల్గొన్నారు. ట్రాఫిక్ భద్రతకు అనుగుణంగా వారి ప్రయత్నాలకు కౌన్సిల్ సభ్యులకు షేఖ్ రషీద్ కృతజ్ఞతలు వ్యక్తపరిచారు. చట్టం ప్రకారం అనుగుణంగా ట్రాఫిక్ జామ్లు, ప్రమాదాలు ఎదుర్కోవటానికి ట్రాఫిక్ ప్రవాహాన్ని మరియు వేగవంతమైన చర్యలను నియంత్రించడానికి అవసరమైన చర్యల ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









