సైకిల్ తొక్కడానికి సంకోచించకండి, కొత్త జరిమానాలు మీ జోలికి రావు
- May 21, 2017
బైక్ నుండి విముక్తి ఉద్యమం సైక్లిస్ట్లకు నగరాన్ని మరింతగా అందుబాటులో ఉంచడానికి ఎమిరేట్ పూర్తిగా ప్రోత్సాహించనుంది. ఈ పరిణామాలు సైకిల్ తొక్కేవారికి పూర్తిగా దోహదపడుతుంది. కొత్త ట్రాఫిక్ జరిమానాలు విడుదల అయినందున దుబాయ్ పరిసర ప్రాంతాలలోని పలువురు ఆందోళన చెందారు. అనేక మంది దుబాయ్ నివాసితులు వారి కార్యాలయాల్లోకి వెళ్లడానికి ఒక సైకిల్ ను ఉపయోగించాలని ఇష్టపడతారు. బైక్-టు-వర్క్ కదలికలు సైక్లిస్టులు నగరంలో మరింత అందుబాటులోకి రావటానికి ఎమిరేట్ యొక్క కొనసాగుతున్న పరిణామాలకు పూర్తిగా దోహదపడతాయి. గత మూడు సంవత్సరాలలో, దుబాయ్ పట్టణంలో సైకిల్తొక్కేవారు పెరిగి వివిధ మార్గాలలో సైకిల్ పైనే ప్రయాణించడం గమనించవచ్చు. గతంలో, వారాంతాల్లో మాత్రమే సైక్లింగ్ శిక్షణ మరియు వ్యాయామం కోసం రూపొందించిన సైక్లింగ్ ట్రాక్స్ తొక్కాల్సివచ్చేది. ఇటీవలి కాలంలో సైక్లింగ్ అనేది నగరంలో ఒక చోట నుంచి మరొక చోటకు వెళ్లేందుకు ఒక సులువైన మార్గంగా మారింది.ఇటీవల సవరించిన ట్రాఫిక్ జరిమానాల ప్రకారం నివాసిత ప్రాంతాలలో ప్రజా రహదారులపై వినోద బైక్ లతో తిరిగితే, 3000 ధిర్హాం జరిమానా విధించడం వల్ల పట్టణంలో సైకిల్ వాడకం క్రమేపీ పెరిగింది.యుఎఇ లో కాలుష్య రహిత హరిత సమాజాన్ని ప్రోత్సహించే లక్ష్యానికి మినహాయింపుగా సైకిల్ తొక్కేవారికి ఎటువంటి మినహాయింపులు జరిమానాలు ఉండవని జ్యూమరా మౌంటెన్ బైకర్స్ యొక్క వోల్టైర్ జామిసన్ పేర్కొన్నారు. అయితే ముఖ్యంగా రహదారి భద్రతా మార్గదర్శకాలకు అనుగుణంగా సైక్లిస్టులు వ్యవహరించాల్సి ఉందని సైక్లిస్టులు సరైన భద్రతా సామగ్రిని ధరించాలని - ఒక బైక్ హెల్మెట్, ప్రతిబింబపు చొక్కా మరియు ముందు మరియు వెనుక లైట్లు కల్గి ఉండాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









