రమదాన్ పునస్కరించుకొని ప్రైవేట్ రంగంలో రోజుకు ఆరు గంటల పని
- May 24, 2017
పవిత్ర మాసం రమదాన్ సందర్భంగా ప్రైవేటు రంగ కంపెనీలు, కార్పొరేషన్ లు కార్మిక చట్టంలో భాగంగా, ఆరు పని గంటల తగ్గింపునకు కట్టుబడి ఉండాలని అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, లేబర్ అండ్ సోషల్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంటూ రమదాన్ కాలం లో 6 గంటల పనిని అమలు చేయడంలో సంస్థలపై పర్యవేక్షక పాత్రను ధృవీకరించింది. అదేవిధంగా, మంత్రిత్వశాఖ యొక్క తనిఖీ అధికారుల నియమావళిని అమలు చేయడానికి తగిన సూచనలను ఇచ్చింది. వీరు సైట్లు మరియు వివిధ కంపెనీలకు చెందిన పని స్ధలాలు పరిశీలించేందుకు వివిధ పర్యటనలు నిర్వహిస్తారు. సంబంధిత సంస్థలలో పనిగంటలు అమలు విషయంలో ఏదైనా ఉల్లంఘనలను అమలు చేయడంలో పొరబాట్లు జరిగితే చట్టపరమైన ప్రక్రియలు తీసుకోబడతాయి. అంతేకాకుండా, మంత్రివర్గం , వివిధ కమ్యూనికేషన్ ఛానల్ మరియు హాట్ లైన్ ద్వారా కార్మికుల పనిగంటలు అమలు విషయంపై వివిధ ఫిర్యాదులను తీసుకొంటుంది. అటువంటి సమాచారం ఇచ్చిన కార్మికుల హక్కులను కాపాడడానికి కఠినమైన గోప్యతతో వ్యవహరించబడుతుందని తెలిపింది.
తాజా వార్తలు
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం







