ఈశాన్య జకర్తాలో భారీ పేలుళ్లు
- May 24, 2017
జకర్తా: ఇండోనేషియా బాంబులతో దద్దరిల్లింది. ఈశాన్య జకర్తాలో భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఓ బస్ స్టేషన్ కు సమీపంలో రెండు వరుస పేలుళ్లు చోటు చేసుకోవడం పెద్ద మొత్తంలో గాయపడ్డారు. ఓ పోలీసు అధికారి ఈ బాంబు పేలుళ్ల గురించి మాట్లాడుతూ పేలుడు బుధవారం రాత్రి 9గంటల ప్రాంతంలో చోటు చేసుకుందని, జరిగిన నష్టం తీవ్రత చూస్తుంటే భారీ పేలుడని చెప్పగలనని అన్నారు. కాంపంగ్ మెలయు బస్ టెర్మినల్ వద్ద ఈ పేలుడు చోటు చేసుకుందని, ఇక్కడ నుంచి మినీ బస్సులు, పెద్ద బస్సులు నడుస్తాయని అన్నారు. గాయపడిన వారిని ఆస్పత్రిలోకి చేర్పించినట్లు తెలిపారు.
అయితే, ప్రాణనష్టం, గాయపడిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశంగా ఇండోనేషియాకు పేరుంది. పైగా ఆసియాలోనే పర్యాటకానికి, చక్కటి సహజ సిద్ధ ప్రకృతికి నిలయమైన ఈ దేశంలో కూడా పేలుళ్లు చోటు చేసుకోవడం అక్కడి వారు ఉలిక్కి పడ్డారు. పేలుళ్ల సంభవించిన చోటుకి రక్షణ బలగాలు కదులుతున్నాయి. ఈ దాడిని తామే చేసినట్లు ఏ ఉగ్రవాద సంస్థ ఇంకా ప్రకటించలేదు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









