ఈశాన్య జకర్తాలో భారీ పేలుళ్లు
- May 24, 2017
జకర్తా: ఇండోనేషియా బాంబులతో దద్దరిల్లింది. ఈశాన్య జకర్తాలో భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఓ బస్ స్టేషన్ కు సమీపంలో రెండు వరుస పేలుళ్లు చోటు చేసుకోవడం పెద్ద మొత్తంలో గాయపడ్డారు. ఓ పోలీసు అధికారి ఈ బాంబు పేలుళ్ల గురించి మాట్లాడుతూ పేలుడు బుధవారం రాత్రి 9గంటల ప్రాంతంలో చోటు చేసుకుందని, జరిగిన నష్టం తీవ్రత చూస్తుంటే భారీ పేలుడని చెప్పగలనని అన్నారు. కాంపంగ్ మెలయు బస్ టెర్మినల్ వద్ద ఈ పేలుడు చోటు చేసుకుందని, ఇక్కడ నుంచి మినీ బస్సులు, పెద్ద బస్సులు నడుస్తాయని అన్నారు. గాయపడిన వారిని ఆస్పత్రిలోకి చేర్పించినట్లు తెలిపారు.
అయితే, ప్రాణనష్టం, గాయపడిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశంగా ఇండోనేషియాకు పేరుంది. పైగా ఆసియాలోనే పర్యాటకానికి, చక్కటి సహజ సిద్ధ ప్రకృతికి నిలయమైన ఈ దేశంలో కూడా పేలుళ్లు చోటు చేసుకోవడం అక్కడి వారు ఉలిక్కి పడ్డారు. పేలుళ్ల సంభవించిన చోటుకి రక్షణ బలగాలు కదులుతున్నాయి. ఈ దాడిని తామే చేసినట్లు ఏ ఉగ్రవాద సంస్థ ఇంకా ప్రకటించలేదు.
తాజా వార్తలు
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం







