నెట్ కనెక్షన్ లేకుండానే ఇన్ స్టెంట్ మెసేజింగ్
- October 08, 2015
ఇన్ స్టెంట్ మెసేజింగ్ యాప్ అయిన హైక్ మెసెంజర్ వాడాలంటే ఫోన్లో ఇంటర్ నెట్ కనెక్షన్ ఉండాలి కదూ.. కానీ ఇప్పుడు ఇంటర్ నెట్ కనెక్షన్ లేకుండానే దాన్ని వాడుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. తమకు దాదాపు 7 కోట్లమంది యూజర్లు ఉన్నారని, కానీ ఇప్పటికీ దేశంలో చాలామంది స్మార్ట్ ఫోన్ వాడకందారులకు ఇంటర్ నెట్ కనెక్షన్ ఉండట్లేదని, అందుకే తాము ఇంటర్ నెట్ అవసరం లేకుండానే తమ యాప్ ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తున్నామని హైక్ మెసెంజర్ వ్యవస్థాపకుడు, సీఈవో కవిన్ భారతి మిట్టల్ తెలిపారు. వై-ఫై, మొబైల్ డేటా ఏవీ లేకుండానే ఫొటోలు, స్టిక్కర్లు, ఫైళ్లు, మెసేజిలను ఇతర హైక్ మెసెంజర్ వాడకం దారులకు పంపుకోవచ్చని ఆయన వివరించారు. 70 ఎంబీ పరిమాణంలో ఉండే పెద్ద ఫైళ్లను కూడా కేవలం 10 సెకండ్లలోనే పంపేయొచ్చన్నారు. ఏడాదికి దాదాపు నూరు శాతం చొప్పున వృద్ధిరేటు తమ యాప్ కు ఉంటోందన్నారు. ప్రస్తుతం నెలకు 2వేల కోట్ల మెసేజిలు పంపుతున్నారని, వారానికి కనీసం 140 నిమిషాలు ఈ యాప్ మీద గడుపుతున్నారని చెప్పారు. ఇటీవలే వందమంది యూజర్లతో కాన్ఫరెన్స్ కాల్ చేసుకునే అవకాశాన్ని కూడా హైక్ మెసెంజర్ కల్పించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







