తీపికబురు వచ్చే నాలుగైదేళ్లలో 25 లక్షల ఐటీ ఉద్యోగాలు
- May 25, 2017
ఉద్వాసన భయంతో ఐటీ ఉద్యోగులు బిక్కుబిక్కుమంటున్న సమయంలో కేంద్రం ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తీపికబురు చెప్పారు. వచ్చే నాలుగైదేళ్లలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో 20-25 లక్షల ఉద్యోగాలు రానున్నాయని పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా ఈ ఉద్యోగాల కల్పన జరగనుందని వివరించారు. మూడేళ్ల మోదీ పాలనలో తన మంత్రిత్వశాఖ సాధించిన విజయాల గురించి ఓ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. డిజిటల్ ఎకానమీ రోడ్ మ్యాప్ తయారీ కోసం కన్సల్టెన్సీ సంస్థ మెకెన్సీని నియమించినట్టు పేర్కొన్నారు. వచ్చే 5-7 ఏళ్లలో దేశంలోని డిజిటల్ ఎకానమీ ఒక ట్రిలియన్కు చేరుకుంటుందన్నారు. ఐటీ రంగం నుంచి ఉద్యోగులు పెద్దమొత్తంలో ఉద్వాసనకు గురికానున్నట్టు వస్తున్న వార్తను ఖండించిన రవిశంకర్ ప్రసాద్ వచ్చే నాలుగైదేళ్లలో 20-25 లక్షల కొత్త ఉద్యోగాలు రానున్నట్టు చెప్పారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







