తీపికబురు వచ్చే నాలుగైదేళ్లలో 25 లక్షల ఐటీ ఉద్యోగాలు
- May 25, 2017
ఉద్వాసన భయంతో ఐటీ ఉద్యోగులు బిక్కుబిక్కుమంటున్న సమయంలో కేంద్రం ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తీపికబురు చెప్పారు. వచ్చే నాలుగైదేళ్లలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో 20-25 లక్షల ఉద్యోగాలు రానున్నాయని పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా ఈ ఉద్యోగాల కల్పన జరగనుందని వివరించారు. మూడేళ్ల మోదీ పాలనలో తన మంత్రిత్వశాఖ సాధించిన విజయాల గురించి ఓ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. డిజిటల్ ఎకానమీ రోడ్ మ్యాప్ తయారీ కోసం కన్సల్టెన్సీ సంస్థ మెకెన్సీని నియమించినట్టు పేర్కొన్నారు. వచ్చే 5-7 ఏళ్లలో దేశంలోని డిజిటల్ ఎకానమీ ఒక ట్రిలియన్కు చేరుకుంటుందన్నారు. ఐటీ రంగం నుంచి ఉద్యోగులు పెద్దమొత్తంలో ఉద్వాసనకు గురికానున్నట్టు వస్తున్న వార్తను ఖండించిన రవిశంకర్ ప్రసాద్ వచ్చే నాలుగైదేళ్లలో 20-25 లక్షల కొత్త ఉద్యోగాలు రానున్నట్టు చెప్పారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









