ట్విట్టర్ కు గుడ్ బై చెప్పిన ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్
- May 25, 2017
ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూనిగమ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్విటర్కు గుడ్బై చెప్పారు. ట్విట్టర్కు గుడ్బై చెబుతున్నట్లు ఆయన బుధవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. అంతేకాదు తన ట్వీట్లను త్వరగా స్క్రీన్షాట్లు తీసుకోవాలని కాసేపటి తర్వాత తన ట్వీట్లు కనిపించవని ఆయన మీడియాకు వెల్లడించారు. ట్విట్టర్లో సోనూ నిగమ్కు 70 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం... బాలీవుడ్కు చెందిన సీనియర్ గాయకుడు అభిజిత్ భట్టాచార్య ట్విట్టర్ ఖాతాను ఆ సంస్థ యాజమాన్యం నిషేధించినందుకు నిరసనగా సోనూ నిగమ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. 'నాకు 70 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. వారికి గుడ్బై. చాలా మందిని నొప్పిస్తూ నేను ట్విటర్ నుంచి తప్పుకుంటున్నా. నా నిర్ణయం పట్ల కొందరు శాడిస్ట్లు సంతోషంగా ఉంటారు. నిద్రపోతున్న వారిని లేపగలం. కానీ నిద్రపోతున్నట్లు నటిస్తున్న వారిని లేపలేం..' అని సోనూ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









