రస్ అల్ ఖైమా: 363 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- May 25, 2017
సుప్రీం కౌన్సిల్ మెంబర్, రస్ అల్ ఖైమా రూలర్ షేక్ సౌద్ బిన్ సక్ర్ అల్ కాసిమి, 363 మంది ఖైదీలను విడుదల చేస్తూ క్షమాభిక్షను ప్రసాదించారు. పవిత్ర రమదాన్ మాసం, అలాగూ యూఏఈ 'ఇయర్ ఆఫ్ గివింగ్' కార్యక్రమంలో భాగంగా ఈ క్షమాభ్షిను ప్రసాదించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఖైదీలకు సంబంధించిన ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగించేందుకు కూడా షేక్ సౌద్ సుముఖత వ్యక్తం చేశారు. రస్ అల్ ఖైమా జ్యుడీషియల్ కౌన్సిల్ ఛైర్మన్కి ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తూ, క్షమాభిక్షకు సంబంధించి అవసరమైన వ్యవహారాల్ని చూసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ సౌద్ బిన్ సక్ర్ అల్ కాసిమి. క్షమాభిక్ష పొందినవారు సమాజంలో మంచి పౌరులుగా జీవించాలనీ, వారి కుటుంబాలకు మంచి జీవితాన్ని అందించడంతోపాటు, దేశ ప్రగతిలోనూ భాగం కావాలని ఈ సందర్భంగా సూచించారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









