దోలా-సాదియా భారత్ దేశంలోనే అతిపెద్ద బ్రిడ్జ్
- May 25, 2017భారత్: భారత్ దేశంలోనే అతిపెద్ద బ్రిడ్జ్కు శుక్రవారం ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. అస్సాంలో ఉన్న ఈ ఫాస్ట్ ట్రాక్ బ్రిడ్జ్ ఆర్మీ ఇండియా-చైనా బోర్డర్కు చాలా కీలకమైనది. ఈ వంతెన నిర్మాణానికి 2011లో అప్పటి ప్రధాని మన్మోహన్ శంకుస్థాపన చేసినా... నిర్మాణం మాత్రం జరగలేదు. అయితే ఇండియా-చైనా బోర్డర్లో కీలకమైన ఈ ప్రాజెక్ట్ను సీరియస్గా తీసుకున్న కేంద్రం నిధులు కేటాయించి... మూడేళ్లలో పూర్తి చేసింది.
దోలా-సాదియా మధ్య లోహిత్ నదిపై ఈ బ్రిడ్జ్ను నిర్మించారు. ఈ వంతెన పొడవు 9కిలోమీటర్లుకాగా... అస్సాం రాజధాని గౌహతికి సరిగ్గా 540 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే అరుణాచల్ప్రదేశ్ రాజధాని ఇటానగర్కు 300 కిలోమీటర్ల దూరం. అస్సాం-అరుణాచల్ ప్రదేశ్ మధ్య రాకపోకలకు ఈ బ్రిడ్జ్ కీలకమైనది. అలాగే అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్కు నాలుగు గంటల్లో చేరుకోవచ్చు.
ప్రధానంగా ఆర్మీకి ఈ బ్రిడ్జ్ అత్యంత కీలకమైనది. అస్సాం నుంచి అరుణాచల్ప్రదేశ్లోని చైనా బోర్డర్కు వెళ్లేందుకు ఈ వంతెన ప్రధానమైనది. అంతేకాదు 60 టన్నుల బరువుండే యుద్ధ ట్యాంకులు బ్రిడ్జిపై నుంచి వెళ్లినా తట్టుకునేలా నిర్మించారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి 950 కోట్లు ఖర్చయ్యింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..