మాస్లర్ బ్లాస్టర్ సచిన్ను సిల్వర్ స్క్రీన్పై ఆవిష్కరించిన ‘ఎ బిలియన్ డ్రీమ్స్’
- May 26, 2017
మాస్లర్ బ్లాస్టర్ సచిన్ జీవితచరిత్రపై తెరకెక్కిన సినిమా ఎ బిలియన్ డ్రీమ్స్ చూసిన సెలబ్రిటీలు సినిమాపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సచిన్ను ట్వీట్లతో ముంచెత్తుతున్నారు. మాస్టర్ రిటైర్మెంట్తో నాలుగేళ్లుగా మూగబోయిన అభిమానులు.. మళ్లీ ఇన్నాళ్లకు పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదని టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ అభిమానులకు పిలుపునిచ్చాడు. మాస్టర్ గురించి ఎన్నో తెలియని విషయాలు, అతనికి ఎదురైన సవాళ్ల గురించి సినిమా కళ్లకు కట్టినట్లు చూపించిందని ధోనీ చెప్పాడు. సచిన్.. నీకెవరూ సాటిరారు అంటూ మరో వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ ట్వీట్ చేశాడు. ప్రతి ఇండియన్లోనూ స్ఫూర్తి నింపిన సచిన్ సర్కు కృతజ్ఞతలు అంటూ రహానే ట్వీట్ చేశాడు. క్రికెటర్లతో పాటు ఈ స్పెషల్ షోని బాలీవుడ్ లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, ఆశా భోంస్లే, ఆమిర్ఖాన్, షారుక్ ఖాన్, అనిల్కపూర్, ఐశ్వర్య రాయ్, ఏఆర్ రెహమాన్ చూశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ సినిమాను ఆకాశానికెత్తారు. సచిన్ ఉన్న దేశంలో నివసిస్తున్నందుకు గర్వంగా ఉందంటూ అమితాబ్ ట్వీట్ చేయడం ప్రత్యేకతను సంతరించుకుంది.
తాజా వార్తలు
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!









