ఈజిప్టులో ఓ బస్సుపై గన్మెన్ దాడి: 23మంది మృతి
- May 26, 2017
ఈజిప్టులో ఓ బస్సుపై గన్మెన్ విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో దాదాపు 23 మంది ప్రాణాలు కోల్పోగా.. 25 మందికి పైగా గాయపడినట్లు అక్కడి స్టేట్ టీవీ వెల్లడించారు. శుక్రవారం మిన్యా ప్రావిన్స్లోని సెయింట్ శామ్యూల్ మోనస్టీ నుంచి బయలుదేరిన బస్సుపై కాల్పులు జరిగాయి. దాడిని ఈజిప్టు ఆరోగ్య మంత్రిత్వశాఖ కూడా ధ్రువీకరించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాల్పులు జరిపిన వ్యక్తి కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు.
గత నెల ఈజిప్టులోని రెండు ప్రముఖ చర్చిలపై గంటల వ్యవధిలోనే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేసి మారణహోమం సృష్టించారు. ఈస్టర్ పండుగకు వారం ముందు ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో దాదాపు 47 మందిపైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు









