బ్రెజిల్ ఉత్తర ప్రాంతం జైలు నుండి 89 మంది ఖైదీల పరారీ
- May 27, 2017
- జైలు నుండి 30 మీటర్ల సొరంగం తవ్విన వైనం
బ్రెజిల్ ఉత్తర ప్రాంతంలోని రియో గ్రాండ్ డి నార్త్ రాష్ట్రంలోని ఒక జైలు నుండి దాదాపు 89 మంది ఖైదీలు 30 మీటర్ల సొరంగం ద్వారా తప్పించుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర రాజధాని నాటాల్ నగరంలోని పెర్నామిరిం జైలు నుండి గురువారం ఉదయం ఖైదీలు పరారయ్యారని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వివరించింది. ఖైదీలు జైలు నుండి వెలుపలి వరకూ దాదాపు 30 మీటర్ల పొడవునా తవ్విన సొరంగం ద్వారా తప్పించుకున్నారని తెలుస్తోంది. రియో గ్రాండ్ డి నార్త్ చరిత్రలోనే ఇది అతి పెద్ద జైలు బ్రేక్ ఘటన అని అధికారులు చెబుతున్నారు. పరారయిన వారిలో తొమ్మిది మందిని ఇప్పటికే తాము అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఖైదీలను తప్పించేందుకు జైలు బయట రెండు కార్లు, ఒక మోటార్ సైకిల్ను వినియోగించినట్లు జైలు భద్రతా విధులు నిర్వహిస్తున్న మిలటరీ పోలీసులు చెప్పారు. బయట తమను ఎవరూ గుర్తుపట్టకుండా వుండేందుకు వారు జైలులోనే తమ దుస్తులు మార్చుకున్నట్లు వారు వివరించారు. ఈ ఏడాదిలో ఈ జైలు నుండి ఖైదీలు తప్పించుకోవటం ఇది రెండోసారి.
గత జనవరిలో 14 మంది ఖైదీలు సొరంగ మార్గం ద్వారా తప్పించుకున్న విషయం తెలిసిందే. ఈ జైలు గరిష్ట సామర్ధ్యం 436 మంది ఖైదీలు కాగా, ఈ ఘటన జరిగిన సమయంలో మొత్తం 589 మంది ఖైదీలున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







