బ్రెజిల్ ఉత్తర ప్రాంతం జైలు నుండి 89 మంది ఖైదీల పరారీ
- May 27, 2017
- జైలు నుండి 30 మీటర్ల సొరంగం తవ్విన వైనం
బ్రెజిల్ ఉత్తర ప్రాంతంలోని రియో గ్రాండ్ డి నార్త్ రాష్ట్రంలోని ఒక జైలు నుండి దాదాపు 89 మంది ఖైదీలు 30 మీటర్ల సొరంగం ద్వారా తప్పించుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర రాజధాని నాటాల్ నగరంలోని పెర్నామిరిం జైలు నుండి గురువారం ఉదయం ఖైదీలు పరారయ్యారని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వివరించింది. ఖైదీలు జైలు నుండి వెలుపలి వరకూ దాదాపు 30 మీటర్ల పొడవునా తవ్విన సొరంగం ద్వారా తప్పించుకున్నారని తెలుస్తోంది. రియో గ్రాండ్ డి నార్త్ చరిత్రలోనే ఇది అతి పెద్ద జైలు బ్రేక్ ఘటన అని అధికారులు చెబుతున్నారు. పరారయిన వారిలో తొమ్మిది మందిని ఇప్పటికే తాము అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఖైదీలను తప్పించేందుకు జైలు బయట రెండు కార్లు, ఒక మోటార్ సైకిల్ను వినియోగించినట్లు జైలు భద్రతా విధులు నిర్వహిస్తున్న మిలటరీ పోలీసులు చెప్పారు. బయట తమను ఎవరూ గుర్తుపట్టకుండా వుండేందుకు వారు జైలులోనే తమ దుస్తులు మార్చుకున్నట్లు వారు వివరించారు. ఈ ఏడాదిలో ఈ జైలు నుండి ఖైదీలు తప్పించుకోవటం ఇది రెండోసారి.
గత జనవరిలో 14 మంది ఖైదీలు సొరంగ మార్గం ద్వారా తప్పించుకున్న విషయం తెలిసిందే. ఈ జైలు గరిష్ట సామర్ధ్యం 436 మంది ఖైదీలు కాగా, ఈ ఘటన జరిగిన సమయంలో మొత్తం 589 మంది ఖైదీలున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









