వినాయక్ తో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్
- May 28, 2017
మెగా స్టార్ చిరంజీవి తో ఖైదీ నెం 150 వంటి బ్లాక్ బస్టర్ హిట్ తెరకెక్కించిన వి వి వినాయక్ , మరోసారి మెగా ఫోన్ పట్టుకున్నాడని తెలుస్తుంది. తిక్క , విన్నర్ చిత్రాల ప్లాప్స్ తో డీలా పడ్డ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఓ మాస్ హిట్ కోసం ట్రై చేస్తున్నాడు. ఇప్పుడున్న డైరెక్టర్స్ లలో మాస్ చిత్రం తెరకెక్కించాలంటే ఒక్క వినాయక్ మాత్రమే. అందుకే ఈయన చూపు ఈ డైరెక్టర్ పడిందని తెలుస్తుంది.
సాయిధరం తేజ్ తో వివి వినాయక్ మూవీ అంటూ గతంలో వార్తలొచ్చాయి కానీ.. ఇప్పుడీ ప్రాజెక్ట్ కన్ఫాం అంటున్నారు మెగా అభిమానులు. ఇప్పటికే ఓ మాంచి యూత్ సబ్జెక్టును రెడీ చేసుకున్న వినాయక్.. తేజుతో డిస్కషన్స్ పూర్తి చేసేశాడట. ప్రస్తుతం ఆ స్టోరీకి తన అసిస్టెంట్స్ తో కలిసి తనదైన స్టైల్ లోకి మార్చుకుంటూ మెరుగులు దిద్దుతున్నట్లు చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందట.. అంతే కాదు ఈ మూవీలో లావణ్య త్రిపాఠి ని హీరోయిన్ గా ఎంపిక చేసారని తెలుస్తుంది.
ఇప్పటికే అల్లు శిరీష్.. వరుణ్ తేజ్ లతో రొమాన్స్ చేసిన లావణ్య త్రిపాఠికి.. ఇప్పుడు తేజు తో జోడి కట్టబోతుంది. ప్రస్తుతం తేజు బీవీఎస్ రవి దర్శకత్వంలో జవాన్.. సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో ఓ చిత్రం చేస్తున్నాడు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







