వినాయక్ తో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్
- May 28, 2017
మెగా స్టార్ చిరంజీవి తో ఖైదీ నెం 150 వంటి బ్లాక్ బస్టర్ హిట్ తెరకెక్కించిన వి వి వినాయక్ , మరోసారి మెగా ఫోన్ పట్టుకున్నాడని తెలుస్తుంది. తిక్క , విన్నర్ చిత్రాల ప్లాప్స్ తో డీలా పడ్డ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఓ మాస్ హిట్ కోసం ట్రై చేస్తున్నాడు. ఇప్పుడున్న డైరెక్టర్స్ లలో మాస్ చిత్రం తెరకెక్కించాలంటే ఒక్క వినాయక్ మాత్రమే. అందుకే ఈయన చూపు ఈ డైరెక్టర్ పడిందని తెలుస్తుంది.
సాయిధరం తేజ్ తో వివి వినాయక్ మూవీ అంటూ గతంలో వార్తలొచ్చాయి కానీ.. ఇప్పుడీ ప్రాజెక్ట్ కన్ఫాం అంటున్నారు మెగా అభిమానులు. ఇప్పటికే ఓ మాంచి యూత్ సబ్జెక్టును రెడీ చేసుకున్న వినాయక్.. తేజుతో డిస్కషన్స్ పూర్తి చేసేశాడట. ప్రస్తుతం ఆ స్టోరీకి తన అసిస్టెంట్స్ తో కలిసి తనదైన స్టైల్ లోకి మార్చుకుంటూ మెరుగులు దిద్దుతున్నట్లు చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందట.. అంతే కాదు ఈ మూవీలో లావణ్య త్రిపాఠి ని హీరోయిన్ గా ఎంపిక చేసారని తెలుస్తుంది.
ఇప్పటికే అల్లు శిరీష్.. వరుణ్ తేజ్ లతో రొమాన్స్ చేసిన లావణ్య త్రిపాఠికి.. ఇప్పుడు తేజు తో జోడి కట్టబోతుంది. ప్రస్తుతం తేజు బీవీఎస్ రవి దర్శకత్వంలో జవాన్.. సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో ఓ చిత్రం చేస్తున్నాడు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









