దుమ్ముపట్టిపోయిన వాహనాలకు జరీమానా
- May 28, 2017
అబుదాబీలోని పబ్లిక్ స్క్వేర్స్లో దుమ్ముపట్టిపోయి, వదిలివేయబడ్డ 170 కార్లకు జరీమానా విధించారు అధికారులు. అబుదాబీ సిటీ మునిసిపాలిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. 175 అఫెన్స్ టిక్కెట్స్ని ఆయా వాహనాల యజమానులకు పంపినట్లు తెలిపారు అధికారులు. వదిలివేయబడ్డ వాహనాలు దుమ్ముపట్టిపోయి, సిటీ అందాన్ని చెడగొడ్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మూడు రోజుల క్యాంపెయిన్లో భాగంగా ఈ చర్యల్ని అబుదాబీ మునిసిపాలిటీ చేపట్టింది. పబ్లిక్ న్యూసెన్స్గా మారిన ఇలాంటి వాహనాల పట్ల ముందు ముందు ఇంకా కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. వాహన యజమానులు ఆ వాహనాలు తమవేనని ధృవీకరించుకునేందుకు తగిన ఆధారాల్ని చూపించాల్సి ఉంటుందనీ, ఆ తర్వాత 3000 దిర్హామ్లు జరీమానా కట్టి, వాటిని తమతో తీసుకెళ్ళవచ్చునని వారు తెలిపారు. మూడు రోజులపాటు వాహనాన్ని గమనించి, దానికి స్టిక్కర్ అందిస్తారు అధికారులు. ఆ తర్వాత దాన్ని అక్కడినుంచి 24 గంటల తర్వాత తొలగిస్తారు. ఈలోగా వాహనాన్ని యజమానులు జరీమానా కట్టి విడిపించుకోవాల్సి ఉంటుంది. లేదంటే, ఆ తర్వాత ఇంకా కఠిన చర్యలుంటాయి.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







