దుమ్ముపట్టిపోయిన వాహనాలకు జరీమానా
- May 28, 2017
అబుదాబీలోని పబ్లిక్ స్క్వేర్స్లో దుమ్ముపట్టిపోయి, వదిలివేయబడ్డ 170 కార్లకు జరీమానా విధించారు అధికారులు. అబుదాబీ సిటీ మునిసిపాలిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. 175 అఫెన్స్ టిక్కెట్స్ని ఆయా వాహనాల యజమానులకు పంపినట్లు తెలిపారు అధికారులు. వదిలివేయబడ్డ వాహనాలు దుమ్ముపట్టిపోయి, సిటీ అందాన్ని చెడగొడ్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మూడు రోజుల క్యాంపెయిన్లో భాగంగా ఈ చర్యల్ని అబుదాబీ మునిసిపాలిటీ చేపట్టింది. పబ్లిక్ న్యూసెన్స్గా మారిన ఇలాంటి వాహనాల పట్ల ముందు ముందు ఇంకా కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. వాహన యజమానులు ఆ వాహనాలు తమవేనని ధృవీకరించుకునేందుకు తగిన ఆధారాల్ని చూపించాల్సి ఉంటుందనీ, ఆ తర్వాత 3000 దిర్హామ్లు జరీమానా కట్టి, వాటిని తమతో తీసుకెళ్ళవచ్చునని వారు తెలిపారు. మూడు రోజులపాటు వాహనాన్ని గమనించి, దానికి స్టిక్కర్ అందిస్తారు అధికారులు. ఆ తర్వాత దాన్ని అక్కడినుంచి 24 గంటల తర్వాత తొలగిస్తారు. ఈలోగా వాహనాన్ని యజమానులు జరీమానా కట్టి విడిపించుకోవాల్సి ఉంటుంది. లేదంటే, ఆ తర్వాత ఇంకా కఠిన చర్యలుంటాయి.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









