జీతాలు చెల్లించని కంపెనీపై ఫిర్యాదు

- May 29, 2017 , by Maagulf
జీతాలు చెల్లించని కంపెనీపై ఫిర్యాదు

మనామా:కొన్ని నెలలుగా కార్మికులకు జీతాలు చెల్లించని ఓ ప్రైవేటు కన్‌స్ట్రక్షన్‌ కంపెనీపై స్థానిక హ్యూమన్‌ రైట్స్‌ గ్రూప్‌ ఫిర్యాదు చేసింది. జి.పి. జచారిదెస్‌ ఒవర్‌సీస్‌ లిమిటెడ్‌ కంపెనీ, గత కొన్ని నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో కార్మికులకు జీతాలు చెల్లించలేకపోతోంది. బహ్రెయిన్‌ హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ సొసైటీ (బిహెచ్‌ఆర్‌డబ్ల్యుఎస్‌) ఈ విషయాన్ని ధృవీకరించింది ఓ ప్రకటనలో. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎల్‌ఓ) దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కార్మికులు, ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారనీ, రమదాన్‌ మాసంలో వారి ఇబ్బందులు ఇంకా పెరగనున్నాయని బిహెచ్‌ఆర్‌డబ్ల్యుఎస్‌ పేర్కొంది. మైగ్రెంట్‌ వర్కర్స్‌ ప్రొటెక్షన్‌ సొసైటీ, కార్మికులకు కొంతమేర అండగా నిలిచిందనీ, వారికి ఆహారం కొన్నాళ్ళవరకు అందించినా, ఆర్థిక ఇబ్బందులతో ఇప్పుడు ఆ సహాయం అందించలేకపోతోందనీ, లేబర్‌ అండ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ మినిస్ట్రీ జోక్యం చేసుకుని, కంపెనీ ఆస్తుల్ని సీజ్‌ చేయాలని కోరుతోంది హ్యూమన్‌ రైట్స్‌ గ్రూప్‌.మూడు దశాబ్దాలుగా జిపి.జచారియాదెస్‌ ఓవర్సీస్‌ లిమిటెడ్‌ బహ్రెయిన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com