మహానటి సావిత్రి బయోపిక్ ఆధారంగా ‘మహానటి ’ షూటింగ్ షురూ
- May 29, 2017
వెండితెర ధ్రువతార , మహానటి సావిత్రి బయోపిక్ ఎట్టకేలకు సెట్స్మీదకు రానుంది. నాగ్ అశ్విన దర్శకత్వంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ రామకృష్ణ స్టూడియోలో పూజాకార్యక్రమాలు నిర్వహించింది. నాగ్ అశ్విన్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్టు అధికారంగా లాంచ్ అయింది. తొలి షాట్ ని లెజండరీ నటుడు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ఫోటోలపై తొలిషాట్ను చిత్రీకరించారు. త్వరలోనే సెట్స్మీదకువెళ్లనున్నట్టుచిత్ర యూనిట్ ప్రకటించింది.
తెలుగు,తమిళ భాషలలో భారీగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ లో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ పోషించనున్నారు. ఇక సావిత్రి జీవితంలో జరిగిన సంఘటనలు తెలుసుకునే జర్నలిస్ట్ పాత్రలో టాలీవుడ్ బ్యూటీ సమంత అలరించనుంది. మరోవైపు సీనియర్ నటి భానుప్రియ కూడా ఈ ప్రాజెక్ట్ లో ఓ కీలక పాత్ర పోషించనుందని, ప్రస్తుతానికి ఆ పాత్ర వివరాలు సీక్రెట్ అంటున్నాడు నాగ్ అశ్విన్.
సి. అశ్వినీదత్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్వప్నా దత్ నిర్మించనున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కూడా కీ రోల్ పోషిస్తున్నాడట. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ప్రొడ్యూసర్స్ స్వప్న దత్, ప్రియాంక దత్. మహిళా దినోత్సవం రోజు మహానటి సావిత్రి బయోపిక్ ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









