దర్శకరత్న దాసరి మరణం తో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు

- May 30, 2017 , by Maagulf
దర్శకరత్న దాసరి మరణం తో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు

దర్శకరత్న దాసరి మృతికి సంతాపంగా ఈరోజు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న షూటింగ్ లు, అలాగే థియేటర్స్ బంద్ కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. విదేశాలలో షూటింగ్ జరుపుకుంటున్న తెలుగు సినిమాలు సైతం తమ షూటింగ్ లను ఆపివేసి దాసరి మరణం పట్ల దిగ్భ్రాంతి తెలియజేసారు.
పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ ను మూడు రోజుల పాటు వాయిదా వేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. దాసరి మృతికి సంతాప సూచకంగా సినిమా షూటింగ్ ని నిలిపివేస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్‌, దర్శకుడు త్రివిక్రమ్ దాసరి మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com