2018 టీడీపీ మహానాడులో 'మహా స్కెచ్'
- May 30, 2017
బాగా రీఛార్జ్ అయ్యారు తమ్ముళ్లూ.. ఇదే ఛార్జ్ తో కంటిన్యూ అయిపోండి.. అంటూ పార్టీ క్యాడర్ ను ఉత్తేజపరిచారు టీడీపీ అధినేత చంద్రబాబు. విశాఖలో తెలుగుదేశం మహానాడు ముగింపు సందర్భంగా మాట్లాడిన బాబు.. మళ్ళీ 2018 మహానాడులో రెట్టించిన ఉత్సాహంతో పాల్గొందామన్నారు. ఎన్నికలకు బాగా దగ్గరవుతాం కనుక.. ఆ మహానాడు పార్టీకి కీలకమన్న సంగతిని ఆయన గుర్తు చేశారు. తెలంగాణాలో అధికారంలోకి రావడం.. ఆంధ్రప్రదేశ్ లో శాశ్వతంగా అధికారంలో నిలవడమే లక్ష్యాలుగా ప్రణాళికలు గీసుకోవాల్సిన బాధ్యత పార్టీ మీద ఉంటుందన్నారు.
రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లు పూర్తయినా ఇప్పటికీ ఎన్నో సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయి ఉన్నాయని.. అశాస్త్రీయ విభజనే దానికి కారణమని చంద్రబాబు చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో రాజీ పడినప్పటికీ, ఉత్తరాంధ్రకు రైల్వే జోన్ తెచ్చుకోవడంలో కేంద్రానికి తలొగ్గే ప్రసక్తే లేదన్నారు. హైదరాబాద్ తన మానసపుత్రిక అని, హైటెక్ సిటీ తన ఘనతేనని చెప్పుకున్నారు. రెండు రాష్ట్రాల్లో టీడీపీ శాశ్వతంగా నిలవాలన్నది తన ఆశయమన్నారు.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పార్టీ లీడర్లు వేదికపైకి వచ్చి అధినేతకు అభినందనలు తెలిపారు. తర్వాత చంద్రబాబు ప్రసంగిస్తూ ఈ మహానాడులో 34 తీర్మానాలు ప్రవేశపెట్టామని, 94 మంది మాట్లాడారని, 27 గంటలు చర్చలు జరిగాయని వివరించారు. ఇంత సంతృప్తికరంగా ఏ మహానాడూ జరగలేదని నిర్వాహక కమిటీని అభినందించారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









