బాలీవుడ్ స్టార్ హీరోకి తృటిలో తప్పిన ప్రాణగండం
- May 30, 2017
బాలీవుడ్ సూపర్స్టార్ షారూఖ్ఖాన్ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ముంబై ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుండగా సెట్ పైభాగం(రూఫ్) ఒక్కసారిగా కుప్పకూలింది. షారుక్ కూర్చున్న సీటు దగ్గర్లోనే శకలాలు పడిపోవడంతో అంతా ఆందోళన చెందారు.
కాగా, షారుక్ ఎలాంటి గాయాలు లేకుండా బయటపడినా.. ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యాయి. ఆదివారం చోటుచేసుకున్న ఈ సంఘటనను ముంబై మిర్రర్ వెలుగులోకి తెచ్చింది. ప్రమాదం కారణంగా రెండు రోజుల పాటు షూటింగ్ను నిలిపేశారు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. షారుక్ సరసన అనుష్కశర్మ, కత్రినా కైఫ్లు నటిస్తున్నారు. షారుక్ మరుగుజ్జుగా, అనుష్క మానసిక రోగిగా కనిపించబోతున్నట్లు సమాచారం. జబ్ తక్ హై జాన్ తర్వాత ఈ ముగ్గురూ కలిసి నటిస్తున్న రెండో సినిమా ఇది.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









