బాలీవుడ్ స్టార్ హీరోకి తృటిలో తప్పిన ప్రాణగండం
- May 30, 2017
బాలీవుడ్ సూపర్స్టార్ షారూఖ్ఖాన్ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ముంబై ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుండగా సెట్ పైభాగం(రూఫ్) ఒక్కసారిగా కుప్పకూలింది. షారుక్ కూర్చున్న సీటు దగ్గర్లోనే శకలాలు పడిపోవడంతో అంతా ఆందోళన చెందారు.
కాగా, షారుక్ ఎలాంటి గాయాలు లేకుండా బయటపడినా.. ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యాయి. ఆదివారం చోటుచేసుకున్న ఈ సంఘటనను ముంబై మిర్రర్ వెలుగులోకి తెచ్చింది. ప్రమాదం కారణంగా రెండు రోజుల పాటు షూటింగ్ను నిలిపేశారు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. షారుక్ సరసన అనుష్కశర్మ, కత్రినా కైఫ్లు నటిస్తున్నారు. షారుక్ మరుగుజ్జుగా, అనుష్క మానసిక రోగిగా కనిపించబోతున్నట్లు సమాచారం. జబ్ తక్ హై జాన్ తర్వాత ఈ ముగ్గురూ కలిసి నటిస్తున్న రెండో సినిమా ఇది.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









