బాలీవుడ్ స్టార్ హీరోకి తృటిలో తప్పిన ప్రాణగండం
- May 30, 2017
బాలీవుడ్ సూపర్స్టార్ షారూఖ్ఖాన్ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ముంబై ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుండగా సెట్ పైభాగం(రూఫ్) ఒక్కసారిగా కుప్పకూలింది. షారుక్ కూర్చున్న సీటు దగ్గర్లోనే శకలాలు పడిపోవడంతో అంతా ఆందోళన చెందారు.
కాగా, షారుక్ ఎలాంటి గాయాలు లేకుండా బయటపడినా.. ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యాయి. ఆదివారం చోటుచేసుకున్న ఈ సంఘటనను ముంబై మిర్రర్ వెలుగులోకి తెచ్చింది. ప్రమాదం కారణంగా రెండు రోజుల పాటు షూటింగ్ను నిలిపేశారు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. షారుక్ సరసన అనుష్కశర్మ, కత్రినా కైఫ్లు నటిస్తున్నారు. షారుక్ మరుగుజ్జుగా, అనుష్క మానసిక రోగిగా కనిపించబోతున్నట్లు సమాచారం. జబ్ తక్ హై జాన్ తర్వాత ఈ ముగ్గురూ కలిసి నటిస్తున్న రెండో సినిమా ఇది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







