దుబాయ్లో ప్రమాదాలు: ఒకరి మృతి, 14 మందికి గాయాలు
- May 31, 2017
గత కొద్ది రోజుల్లో జరిగిన పలు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా 14 మంది గాయపడ్డారు. దుబాయ్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం గత శుక్రవారం తెల్లవారు ఝామున 3.30 నిమిషాల సమయంలో, ఓ వాహనం, ట్రాక్ని ఢీకొంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అల్ మక్తౌమ్ ఎయిర్పోర్ట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయలయ్యాయి. అదే రోజు తెల్లవారుఝామున 2 గంటలకు జరిగిన మరో ప్రమాదంలో రోడ్డుపై వెళుతున్న సైక్లిస్ట్ని కారు ఢీకొంది. ఇంటర్నేషనల్ సిటీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మరో ప్రమాదం తెల్లవారుజామున 5.15 నిమిషాలకు జరిగింది. సైక్లిస్ట్ని ఎస్యువి వాహనం ఢీకొనగా, సైక్లిస్ట్కి తీవ్రగాయాలయ్యాయి. శనివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆదివారం ఉదయం రెండు భస్సులు ఢీకొనగా, పలువురికి ఈ ఘటనలో గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









