దుబాయ్లో ప్రమాదాలు: ఒకరి మృతి, 14 మందికి గాయాలు
- May 31, 2017
గత కొద్ది రోజుల్లో జరిగిన పలు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా 14 మంది గాయపడ్డారు. దుబాయ్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం గత శుక్రవారం తెల్లవారు ఝామున 3.30 నిమిషాల సమయంలో, ఓ వాహనం, ట్రాక్ని ఢీకొంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అల్ మక్తౌమ్ ఎయిర్పోర్ట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయలయ్యాయి. అదే రోజు తెల్లవారుఝామున 2 గంటలకు జరిగిన మరో ప్రమాదంలో రోడ్డుపై వెళుతున్న సైక్లిస్ట్ని కారు ఢీకొంది. ఇంటర్నేషనల్ సిటీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మరో ప్రమాదం తెల్లవారుజామున 5.15 నిమిషాలకు జరిగింది. సైక్లిస్ట్ని ఎస్యువి వాహనం ఢీకొనగా, సైక్లిస్ట్కి తీవ్రగాయాలయ్యాయి. శనివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆదివారం ఉదయం రెండు భస్సులు ఢీకొనగా, పలువురికి ఈ ఘటనలో గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







