అమెరికాలో తెలుగు వాసి మృతి
- May 31, 2017
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా చేస్తున్న తెలుగు వాసి, ఆయన కుమారుడు ప్రమాదవశాత్తూ మృతిచెందారు. మంగళవారం రాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన నాగరాజు సురపల్లి మిచిగాన్ లోని డెట్రాయిట్ నగరంలో నివాసం ఉంటున్నారు. నాగరాజు స్థానిక ఇన్ఫోసిస్లో ఉద్యోగం చేస్తుండేవారు. నిన్న తన అపార్ట్ మెంట్లో ఉండే స్విమ్మింగ్ పూల్లో మూడేళ్ల చిన్నారి సహా ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. వెంటనే ఎమర్జన్సీ సర్వీస్ కు కాల్ చేశారు. వారు వచ్చి పరిశీలించి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నాగరాజు, ఆయన మూడేళ్ల కుమారుడు అనంత్ చనిపోయారని నిర్ధారించారు.
నాగరాజు మృతిచెందడంతో గుంటూరులోని ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్విమ్మింగ్ పూల్ పక్కన చిన్నారులు ఆడుకునే చిన్న సైకిల్ ఉండటాన్ని గమనిస్తే.. మొదట చిన్నారి అనంత్ స్విమ్మింగ్ పూల్లో పడిపోయి ఉంటాడని, కుమారుడిని కాపాడేక్రమంలో పూల్లో దిగిన నాగరాజు చనిపోయి ఉండొచ్చునని అపార్ట్ మెంట్ వాసులు భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే పూల్ తక్కువ లోతు మాత్రమే ఉందని నాగరాజు చనిపోయే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పోలీస్ అధికారి డేవిడ్ మోల్లాయ్ తెలిపారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







