అమెరికాలో తెలుగు వాసి మృతి
- May 31, 2017
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా చేస్తున్న తెలుగు వాసి, ఆయన కుమారుడు ప్రమాదవశాత్తూ మృతిచెందారు. మంగళవారం రాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన నాగరాజు సురపల్లి మిచిగాన్ లోని డెట్రాయిట్ నగరంలో నివాసం ఉంటున్నారు. నాగరాజు స్థానిక ఇన్ఫోసిస్లో ఉద్యోగం చేస్తుండేవారు. నిన్న తన అపార్ట్ మెంట్లో ఉండే స్విమ్మింగ్ పూల్లో మూడేళ్ల చిన్నారి సహా ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. వెంటనే ఎమర్జన్సీ సర్వీస్ కు కాల్ చేశారు. వారు వచ్చి పరిశీలించి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నాగరాజు, ఆయన మూడేళ్ల కుమారుడు అనంత్ చనిపోయారని నిర్ధారించారు.
నాగరాజు మృతిచెందడంతో గుంటూరులోని ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్విమ్మింగ్ పూల్ పక్కన చిన్నారులు ఆడుకునే చిన్న సైకిల్ ఉండటాన్ని గమనిస్తే.. మొదట చిన్నారి అనంత్ స్విమ్మింగ్ పూల్లో పడిపోయి ఉంటాడని, కుమారుడిని కాపాడేక్రమంలో పూల్లో దిగిన నాగరాజు చనిపోయి ఉండొచ్చునని అపార్ట్ మెంట్ వాసులు భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే పూల్ తక్కువ లోతు మాత్రమే ఉందని నాగరాజు చనిపోయే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పోలీస్ అధికారి డేవిడ్ మోల్లాయ్ తెలిపారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









