అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం
- May 31, 2017
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించుకునే ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగాలని తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని యాక్సియాస్ న్యూస్ సంస్థ తెలిపింది. అత్యంత విశ్వసనీయమైన వర్గాల ద్వారా ఈ విషయం తెలిసినట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న గ్రీన్హౌస్ ఉద్గారాల్లో 56 శాతం విడుదల చేస్తున్న దాదాపు 70 దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయ.
అయితే ఈ చరిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేసేందుకు ట్రంప్ నిరాకరించారు. ఇంతకుముందు దీనిపై నిర్ణయం తీసుకోడానికి తనకు మరింత సమయం అవసరమని ఆయన చెప్పారు. ఈ వారంలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని కూడా గతంలో చేసిన ట్వీట్లో తెలిపారు. ఇప్పుడు కుండ బద్దలుకొట్టేశారు. ప్రపంచంలోని ముఖ్యమైన దేశాల్లో ఈ ఒప్పందం మీద సంతకం చేయని ఏకైక దేశం అమెరికా కావడం గమనార్హం.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







