అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం
- May 31, 2017
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించుకునే ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగాలని తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని యాక్సియాస్ న్యూస్ సంస్థ తెలిపింది. అత్యంత విశ్వసనీయమైన వర్గాల ద్వారా ఈ విషయం తెలిసినట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న గ్రీన్హౌస్ ఉద్గారాల్లో 56 శాతం విడుదల చేస్తున్న దాదాపు 70 దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయ.
అయితే ఈ చరిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేసేందుకు ట్రంప్ నిరాకరించారు. ఇంతకుముందు దీనిపై నిర్ణయం తీసుకోడానికి తనకు మరింత సమయం అవసరమని ఆయన చెప్పారు. ఈ వారంలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని కూడా గతంలో చేసిన ట్వీట్లో తెలిపారు. ఇప్పుడు కుండ బద్దలుకొట్టేశారు. ప్రపంచంలోని ముఖ్యమైన దేశాల్లో ఈ ఒప్పందం మీద సంతకం చేయని ఏకైక దేశం అమెరికా కావడం గమనార్హం.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









