విశాఖలోజులై 15న ప్రధాని నరేంద్ర మోడీ రోడ్షో
- May 31, 2017
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా జులై 15న విశాఖ వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ రోడ్షోలో పాల్గొననున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి కార్యవర్గ సమావేశాలు జరిగే వేదిక వరకు రోడ్షో నిర్వహించాలని భాజపా రాష్ట్రనాయకులు భావిస్తున్నారు. గతంలో భువనేశ్వర్లో నిర్వహించిన కార్యవర్గ సమావేశాల సందర్భంగా ప్రధాని పాల్గొన్న రోడ్షోకు అనూహ్య స్పందన లభించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పి.ఎం.పాలెం క్రికెట్ స్టేడియం పక్కనే ఉన్న ‘వి కన్వెన్షన్’ కేంద్రంలో సమావేశం నిర్వహిస్తే బాగుంటుందని భాజపా పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ప్రధానితో రోడ్షో నిర్వహించాలని భావిస్తున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.హరిబాబు ‘ఈనాడు’కు వెల్లడించారు. రెండురోజుల్లో కార్యవర్గ సమావేశాల వేదిక ఎక్కడన్న అంశం ఖరారు చేస్తామన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..







