విశాఖలోజులై 15న ప్రధాని నరేంద్ర మోడీ రోడ్షో
- May 31, 2017
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా జులై 15న విశాఖ వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ రోడ్షోలో పాల్గొననున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి కార్యవర్గ సమావేశాలు జరిగే వేదిక వరకు రోడ్షో నిర్వహించాలని భాజపా రాష్ట్రనాయకులు భావిస్తున్నారు. గతంలో భువనేశ్వర్లో నిర్వహించిన కార్యవర్గ సమావేశాల సందర్భంగా ప్రధాని పాల్గొన్న రోడ్షోకు అనూహ్య స్పందన లభించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పి.ఎం.పాలెం క్రికెట్ స్టేడియం పక్కనే ఉన్న ‘వి కన్వెన్షన్’ కేంద్రంలో సమావేశం నిర్వహిస్తే బాగుంటుందని భాజపా పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ప్రధానితో రోడ్షో నిర్వహించాలని భావిస్తున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.హరిబాబు ‘ఈనాడు’కు వెల్లడించారు. రెండురోజుల్లో కార్యవర్గ సమావేశాల వేదిక ఎక్కడన్న అంశం ఖరారు చేస్తామన్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









