విశాఖలోజులై 15న ప్రధాని నరేంద్ర మోడీ రోడ్షో
- May 31, 2017
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా జులై 15న విశాఖ వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ రోడ్షోలో పాల్గొననున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి కార్యవర్గ సమావేశాలు జరిగే వేదిక వరకు రోడ్షో నిర్వహించాలని భాజపా రాష్ట్రనాయకులు భావిస్తున్నారు. గతంలో భువనేశ్వర్లో నిర్వహించిన కార్యవర్గ సమావేశాల సందర్భంగా ప్రధాని పాల్గొన్న రోడ్షోకు అనూహ్య స్పందన లభించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పి.ఎం.పాలెం క్రికెట్ స్టేడియం పక్కనే ఉన్న ‘వి కన్వెన్షన్’ కేంద్రంలో సమావేశం నిర్వహిస్తే బాగుంటుందని భాజపా పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ప్రధానితో రోడ్షో నిర్వహించాలని భావిస్తున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.హరిబాబు ‘ఈనాడు’కు వెల్లడించారు. రెండురోజుల్లో కార్యవర్గ సమావేశాల వేదిక ఎక్కడన్న అంశం ఖరారు చేస్తామన్నారు.
తాజా వార్తలు
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!









