ఫ్రెంచ్ ఓపెన్: తొలి రౌండ్లోనే సానియా మీర్జా జోడీ ఓటమి
- May 31, 2017
ఫ్రెంచ్ ఓపెన్లో భారత టెన్నిస్ అభిమానులు బుధవారం మిశ్రమ ఫలితాలను చవిచూశారు. కొత్త భాగస్వామి కజకస్థానీకి చెందిన యారోస్లావా ష్వెదోవాతో కలిసి తొలి గ్రాండ్స్లామ్ ఆడుతోన్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది.
ఫ్రెంచ్ ఓపెన్లో నాలుగో సీడ్గా బరిలోకి దిగిన ఈ జోడీ అనూహ్యంగా తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. దరియా గావ్రిలోవా (ఆస్ట్రేలియా)-అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా) జోడీతో బుధవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా-ష్వెదోవా జోడీ 6-7 (5/7), 6-1, 2-6 తేడాతో ఓటమి పాలైంది.
సుమారు 2 గంటల 23 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సానియా జోడీ రెండు డబుల్ ఫాల్ట్లు చేయడంతోపాటు తమ సర్వీస్ను నాలుగుసార్లు కోల్పోయింది. ఇక పురుషుల డబుల్స్లో భారత స్టార్స్ లియాండర్ పేస్, రోహన్ బోపన్న తమ వేర్వేరు భాగస్వాములతో కలిసి శుభారంభం చేశారు.
తొమ్మిదో సీడ్గా బరిలోకి దిగిన రోహన్ బోపన్న-క్యువాస్ (ఉరుగ్వే) జోడీ 6-1, 6-1తో మథియాస్ బుర్గ్యూ-పాల్ హెన్రీ మథియు (ఫ్రాన్స్) జోడీపై విజయం సాధించింది. ఇక లియాండర్ పేస్-స్కాట్ లిప్స్కీ (అమెరికా) జంట 7-6 (7/5), 4-6, 6-2తో హైయోన్ చుంగ్ (దక్షిణ కొరియా)-అల్బోట్ (మాల్డోవా) ద్వయంపై గెలిచింది.
మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో సానియా మిర్జా క్రోయేసియాకు చెందిన ఇవాన్ డోడిజ్తో కలిసి ఆడనుంది. గతేడాది ఈ జోడీ రన్నరప్గా నిలిచిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









