ఫ్రెంచ్ ఓపెన్: తొలి రౌండ్లోనే సానియా మీర్జా జోడీ ఓటమి
- May 31, 2017
ఫ్రెంచ్ ఓపెన్లో భారత టెన్నిస్ అభిమానులు బుధవారం మిశ్రమ ఫలితాలను చవిచూశారు. కొత్త భాగస్వామి కజకస్థానీకి చెందిన యారోస్లావా ష్వెదోవాతో కలిసి తొలి గ్రాండ్స్లామ్ ఆడుతోన్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది.
ఫ్రెంచ్ ఓపెన్లో నాలుగో సీడ్గా బరిలోకి దిగిన ఈ జోడీ అనూహ్యంగా తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. దరియా గావ్రిలోవా (ఆస్ట్రేలియా)-అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా) జోడీతో బుధవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా-ష్వెదోవా జోడీ 6-7 (5/7), 6-1, 2-6 తేడాతో ఓటమి పాలైంది.
సుమారు 2 గంటల 23 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సానియా జోడీ రెండు డబుల్ ఫాల్ట్లు చేయడంతోపాటు తమ సర్వీస్ను నాలుగుసార్లు కోల్పోయింది. ఇక పురుషుల డబుల్స్లో భారత స్టార్స్ లియాండర్ పేస్, రోహన్ బోపన్న తమ వేర్వేరు భాగస్వాములతో కలిసి శుభారంభం చేశారు.
తొమ్మిదో సీడ్గా బరిలోకి దిగిన రోహన్ బోపన్న-క్యువాస్ (ఉరుగ్వే) జోడీ 6-1, 6-1తో మథియాస్ బుర్గ్యూ-పాల్ హెన్రీ మథియు (ఫ్రాన్స్) జోడీపై విజయం సాధించింది. ఇక లియాండర్ పేస్-స్కాట్ లిప్స్కీ (అమెరికా) జంట 7-6 (7/5), 4-6, 6-2తో హైయోన్ చుంగ్ (దక్షిణ కొరియా)-అల్బోట్ (మాల్డోవా) ద్వయంపై గెలిచింది.
మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో సానియా మిర్జా క్రోయేసియాకు చెందిన ఇవాన్ డోడిజ్తో కలిసి ఆడనుంది. గతేడాది ఈ జోడీ రన్నరప్గా నిలిచిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







