ఖతారైజేషన్‌లో భాగంగా 600 మంది టీచర్ల తొలగింపు

- May 31, 2017 , by Maagulf
ఖతారైజేషన్‌లో భాగంగా 600 మంది టీచర్ల తొలగింపు

రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రిపరేటరీ మరియు సెకెండరీ స్కూల్స్‌, బాయ్స్‌ అండ్‌ గర్ల్స్‌ ఇండిపెండెంట్‌ స్కూల్స్‌లలో అకడమిక్‌, మరియు అడ్మినిస్ట్రేటివ్‌ విభాగాల్లో ఎమిరటైజేషన్‌కి వీలుగా 600 మంది టీచర్ల తొలగింపుకు నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ మరియు హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఈ ప్రకటన జారీ చేసింది. సుమారుగా 650 మంది టీచర్లు ఈ నోటిఫికేషన్‌తో తొలగించబడే అవకాశాలున్నట్లు తెలియవస్తోంది. అతి తక్కువ సమయంలో ఈ నోటీసు తమకు చాలా ఇబ్బందులను కలగజేస్తుందని ఉద్యోగాలు కోల్పోనున్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని స్కూళ్ళలో 14 మంది టీచర్లు, సిబ్బంది ఉద్యోగాలు కోల్పోనుండగా, మరికొన్ని స్కూళ్ళలో 8 నుంచి 10 మంది వరకు తొలగింపబడనున్నారు. స్కూల్‌ డైరెక్టర్స్‌, మినిస్ట్రీకి 2ఎండ్‌ ఆఫ్‌ సర్వీసెస్‌' లెటర్‌ని అందజేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com