హౌసింగ్ మినిస్ట్రీతో మిడిల్ ఈస్ట్ హాస్పిటల్ ఎంఓయూ
- May 31, 2017
మిడిల్ ఈస్ట్ హాస్పిటల్ని హౌసింగ్ మినిస్ట్రీ అండర్ సెక్రెటరీ షేక్ అబ్దుల్లా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా సందర్శించారు. మిడిల్ ఈస్ట్ హాస్పిటల్ మరియు మెడికల్ సెంటర్ - హౌసింగ్ మినిస్ట్రీ మధ్య ఎంఓయూలో బాగంగా ఈ పర్యటన సాగింది. మినిస్ట్రీకి చెందిన ఉద్యోగులు, వారి కుటుంబాలకు వైద్య చికిత్సల్లో ప్రత్యేక డిస్కౌంట్కి సంబంధించిన ఎంఓయూ ఇరు వర్గాల మధ్యా కుదిరింది. అండర్ సెక్రెటరీతోపాటుగా హౌసింగ్ మినిస్ట్రీ డైరెక్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు ఫైనాన్షియల్ డైరెక్టరేట్ షేక్ మొహమ్మద్ బిన్ ఇబ్రహీమ్ అల్ ఖలీఫా మరియు హౌసింగ్ మినిస్ట్రీ చీఫ్ ఆఫ్ పిఆర్ అండ్ మీడియా హైతమ్ కమాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆసుపత్రి అంతటా వీరు సందర్శించి, ఆసుపత్రిలోని సౌకర్యాల గురించి వాకబు చేశారు. బహ్రెయిన్లో ఓపెన్ ఎంఆర్ఐ మెషీన్ని కలిగి ఉన్న అతి కొద్ది హాస్పిటల్లో మిడిల్ ఈస్ట్ హాస్పిటల్ ఒకటి. భవిష్యత్తులో బహ్రెయిన్ వైద్య రంగంలో మిడిల్ ఈస్ట్ హాస్పిటల్ మరిన్ని అద్భుతాలు సాధిస్తుందని అండర్ సెక్రెటరీ ఆశాభావం వ్యక్తం చేశారు. మిడిల్ ఈస్ట్ గ్రూప్ ఛైర్మన్ వర్గీస్ కురియన్ మాట్లాడుతూ, అందుబాటులోకి వస్తున్న సరికొత్త వైద్య విధానాల్ని అందిపుచ్చుకుని, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తాము కృషి చేస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్









