బ్రెజిల్లో వింత ఘటన: బైక్పై శవాన్ని ఊరేగించి!.. చూసినోళ్లంతా షాక్
- June 01, 2017
రక్త సంబంధీకులెవరైనా హఠాత్తుగా చనిపోతే తట్టుకోవడం చాలా కష్టం. ఏళ్లుగా పెనవేసుకున్న బంధాన్ని ఒక్కసారిగా తెంచేసుకోవాలంటే మనసు ఎంతమాత్రం ఒప్పుకోదు. అలా అని విధి ముందు తలవంచక తప్పదు. దు:ఖాన్ని దిగమింగకుని పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడమే తప్పితే.. అంతకుమించి చేసేదేమి ఉండదు.
కానీ బ్రెజిల్కు చెందిన ఓ వ్యక్తి విచిత్రంగా వ్యవహరించాడు. చనిపోయిన సోదరుడిని మరిచిపోలేక ఏకంగా అతని సమాధిని తవ్వి శవపేటికను బయటకు తీశాడు. ఆపై బైక్పై ఎక్కించుకుని ఊరేగించాడు. రోసా అనే ఓ వ్యక్తి చేసిన ఈ పనికి ఊరంతా ముక్కున వేలేసుకున్నారు. ఇదే విషయం పోలీసులు చెవిన పడటంతో తమ వాహనాల్లో అతని బైక్ ను వెంబడించి పట్టుకున్నారు.
తన సోదరుడిని మరిచిపోలేకే ఇలా చేయాల్సి వచ్చిందని రోసా చెప్పాడు. అదీగాక, ఓరోజు కలలో కనిపించి బైక్ పై తిరగాలని ఉందంటూ తన సోదరుడు కోరాడని తెలిపాడు. అందువల్లే సమాధిని తవ్వి తన సోదరుడి శవపేటికను బైక్ పై ఊరేగించానని చెప్పుకొచ్చాడు. పోలీసులు రోసాపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం అతనికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
కాగా, శవపేటికను బైక్ పై ఊరేగిస్తున్న సమయంలో కొంతమంది ఫోటోలు కూడా తీశారు. అవి కాస్త సోషల్ మీడియాలోకి ఎక్కడంతో ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారిపోయాయి.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









