ఆఫ్గనిస్థాన్ కాబూల్లో 24 గంటల్లో రెండో పేలుడు: విమానాశ్రయం వద్ద పేలుడు
- June 01, 2017
కాబూల్లో ఉగ్రదాడిని మరువక ముందే ఆఫ్గనిస్థాన్లో మరో దాడి జరిగింది. కాబూల్కు తూర్పున 120 కి.మీ. దూరంలో ఉన్న జలాలాబాద్లోని విమానాశ్రయం బయట గురువారం ఉదయం కారులో ఉండి బాంబును పేల్చారు.
కాబూల్ బాంబు పేలుడు మా పనే: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రకటన
ఈ ఘటనలో ఒక సైనికుడు మృతి చెందాడు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకొనే ఈ బాంబును పేల్చినట్లు నాన్ఘర్ ప్రావిన్స్ గవర్నర్ తెలిపారు.
దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఆఫ్గనిస్థాన్లో ఆత్మాహుతి దాడి జరగడం 24 గంటల్లో ఇది రెండోసారి. నిన్న ఉదయం కాబూల్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 90 మందికిపైగా మృతిచెందగా, 400 మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







