తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సైకత శిల్పాలు తయారు చేయించిన 'GHMC మేయర్'
- June 01, 2017
హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా హుస్సేన్ సాగర్ తీరాన మన దేశం లోనే మంచి నైపుణ్యం కలిగిన సైకత శిల్పి తరణి ప్రసాద్ మిశ్ర చే హైదరాబాద్ మేయర్ శ్రీ. బొంతు రామ్ మెహన్ రావు కొన్ని సైకత శిల్పాలు తయారు చేయించారు.అందులో తెలంగాణ తల్లి, తెలంగాణ అమరవీరుల స్థూపం మరియు తెలంగాణ రాష్ట్ర చిత్ర పటం లో ముఖ్యమంత్రి కె.సి.ఆర్ శిల్పాలు మాత్రంప్రజలను చాలా ఆకట్టుకొంటున్నాయి.
తరణి ప్రసాద్ మిశ్ర ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా కి చెందిన వ్యక్తి అయినా ముఖ్యమంత్రి కె.సి.ఆర్ పోరాట శైలికి,తెలంగాణ రాష్ట్రములో ఆయన అవలంబిస్తున్న సంక్షేమ పధకాలను చూసి ఆయనకు వీరాభిమానిగా మారారు మిశ్ర లోని నైపుణ్యాన్ని అయన అభిమానాన్ని గుర్తించి మేయర్ బొంతు రామ్ మోహన రావు ఆయనను హైదరాబాద్ కు రప్పించి ట్యాంకుబండ్ ఆవరణలో ఈ సైకత శిల్ప ప్రదర్శనను ఏర్పాటు చేయడం ఎంతో విశేషం సంతరించుకుంది.
సాధారణంగా సముద్ర తీర ప్రాంతాలలో కనిపించే ఈ సైకత శిల్పాలు హైదరాబాద్లో అది హుస్సేన్ సాగర్ తీరంలో కనిపించడం ఇది ప్రధమం.
ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలలో GHMC మేయర్ ఆధ్వర్యంలో జరుగుతున్నఈ సైకత శిల్పాల ప్రదర్శన తెలంగాణ ప్రజలను చాలా ఆకట్టుకోవడం విశేషం.


తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









