తీవ్రవాద నేరం: వ్యక్తికి 40 ఏళ్ళ జైలు
- June 01, 2017
అబుదాబీ: అబుదబీ ఫెడరల్ కోర్ట్ ఆప్పీల్స, పాకిస్తానీ వ్యక్తికి 40 ఏళ్ళ జైలు శిక్షను విధించింది. తీవ్రవాద నేరాలకు పాల్పడుతున్నాడన్న అభియోగాల నేపథ్యంలో 22 ఏళ్ళ వ్యక్తికి న్యాయస్థానం శిక్ష విధించింది. స్పియర్ గన్ని ఉపయోగించి విదేశీయుల్ని హత్య చేసేందుకు యత్నించిన కేసులో 24 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. ఇంకో వైపున ఓ విల్లాని, అలాగే 8 కార్లను తగలబెట్టిన కేసులో 15 ఏళ్ళ జైలు శిక్ష అనంతరం డిపోర్టేషన్ని న్యాయస్థానం ఖరారు చేసింది. మరో కేసులో ఆరుగురు యంగ్ ఎమిరేట్స్ని, టెర్రరిజాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న కేసులో న్యాయస్థానం కౌన్సిలింగ్ సెంటర్కి తరలించాల్సిందిగా ఆదేశించింది. వీరంతా 20 నుంచి 25 ఏళ్ళ వయసువారు. ఇంకో కేసులో నలుగురు జోర్డానియన్లపై డయీష్ టెర్రరిజం గ్రూపులో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న అభియోగాల నేపథ్యంలో కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









