బంగారు తెలంగాణ అంటే ఇదేనా...?
- June 01, 2017
తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం మోగించింది.. సంగారెడ్డిలో ప్రజా గర్జన వేదిక పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభకు విశేష స్పందన లభించింది.. సభకు భారీగా జనం తరలివచ్చారు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్న ఈ సభ నుంచే 2019 ఎన్నికల కోసం వ్యూహాలు మొదలు పెట్టింది టీ కాంగ్రెస్.
రైతుల ఆత్మహత్యలతో తెలంగాణ శ్మశానంగా మారుతోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వప్నం నెరవేరిందా అని ప్రశ్నించారు. గత మూడేళ్లలో 2800 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్.. ఊరికో ఉద్యోగం అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రజా గర్జన పేరుతో సంగారెడ్డిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంట్రాక్టర్లు, ల్యాండ్ మాఫియా హితం కోసం ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని దుయ్యబట్టారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







