కొత్తగా వెయ్యి విమానాలకి ఆర్డర్ ఇచ్చిన భారత్
- June 02, 2017
1000కి పైగా కొత్త విమానాలను ఆర్డర్ చేసిన భారత విమానయాన కంపెనీలు ఇండియాను మూడవ అతిపెద్ద పాసింజర్ విమానాల కొనుగోలు దేశంగా నిలిపాయి. అత్యధికంగా విమానాలను కొనుగోలు చేస్తున్న దేశాల్లో తొలి స్థానంలో అమెరికా, రెండో స్థానంలో చైనా ఉండగా, 3వ స్థానంలో నిలిచిన భారత్ కు భవిష్యత్తులో 1,080 విమానాలు డెలివరీ కానున్నాయి.
ఈ విషయాన్ని సిడ్నీ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ తన తాజా నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ఇండియాలో వివిధ ఎయిర్ లైన్స్ కు చెందిన 480 విమానాలు ఉండగా, వీటి సంఖ్య వచ్చే ఐదారేళ్లలో 1500 దాటనుంది. కాగా, కొత్త ఆర్డర్లలో లోకాస్ట్ ఎయిర్ లైన్స్ సంస్థలైన ఇండిగో, స్పైస్ జెట్ లు అత్యధిక ఆర్డర్లు ఇచ్చాయి. త్వరలో జెట్ ఎయిర్ వేస్, విస్తారా సంస్థలు మరిన్ని విమానాల కొనుగోలుకు ఆర్డర్లు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్
- 130 KM సొంతంగా కారు నడిపిన సీఎం విజయ్
- 1997లో యూఏక్యూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వా పార్క్ ప్రారంభం..!!
- ఒమన్,నార్వేల మధ్య రాజకీయ చర్చలు..!!
- 'ది వాషింగ్టన్ పోస్ట్' ఆరోపణలను ఖండించిన ఖతార్..!!
- హిజ్రీ నూతన సంవత్సర సెలవును ప్రకటించిన బహ్రెయిన్..!!
- స్థిరమైన పర్యాటకానికి బలమైన ప్రపంచ సహకారం కోసం సౌదీ పిలుపు..!!









