అల్లుఅర్జున్ నటించిన 'దువ్వాడ'కు తగిలిన బ్రాహ్మణుల సెగ
- June 02, 2017
అల్లు అర్జున్, హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న 'దువ్వాడ జగన్నాథం' ఫై ఎలాంటి అంచనాలు నెలకొనిన్నాయో చెప్పనవసరం లేదు..ఇటీవల రిలీజ్ అయినా సాంగ్స్ టీజర్స్ తో అంచనాలు తారాస్థాయికి వెళ్ళుతున్నాయి. టీజర్స్ కు వస్తున్న రెస్పాన్స్ చూసి చిత్ర యూనిట్ హ్యాపీ గా ఫీల్ అవుతున్న నేపథ్యం లో చిత్రానికి వివాదం చోటుచేసుకొని షాక్ ఇచ్చింది.
గతం లో రుద్రాక్షమాల, జీన్స్ ప్యాంట్ తో ఉన్న అల్లు అర్జున్ లుక్ ను వ్యతిరేకించిన బ్రాహ్మణ కులస్థులు, తాజాగా విడుదలైన 'అస్మైక భోగ, తస్మైక భోగ' అనే పాటపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. రచయిత సాహితి రాసిన ఈ పాటలోని లిరిక్స్ లోని పదాలు 'నమకం.. చమకం' రుద్ర స్తోత్రాన్ని అవమానించేవిగా ఉన్నాయని, వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. తొలిగించకపోతే పోలీస్ స్టేషన్స్ వరకు వెళ్లతామని హెచ్చరిస్తున్నారు.
గతంలో కూడా మంచు విష్ణు నటించిన 'దేనికైనా రెడీ' చిత్రంపై కూడా ఇలాంటి వివాదమే జరిగి రాష్ట్ర స్థాయిలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మరి ఈ నేపథ్యం లో డీజే యూనిట్ ఆ లిరిక్స్ ను తొలిగిస్తారో లేక బ్రాహ్మణ కులస్థులతో మాట్లాడతారో చూడాలి. జూన్ 23 న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత కాగా , పూజ హగ్దే హీరోయిన్.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









