గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో అత్తాకోడళ్ళైన దేవసేన అవంతికలు ఒకే స్క్రీన్ పై
- June 02, 2017
టాలీవుడ్ లో హీరోయిన్ లుగా అడుగు పెట్టిన అనుష్క, తమన్నాలు పదేళ్ళకు పైగా అయ్యింది.. వీరిద్దరూ బాహుబలి సినిమాలో దేవసేన, అవంతిక పాత్రల్లో నటించి మెప్పించారు.. ఈ సినిమా వీరిద్దరికీ ఎంతో మంచి పేరు తెచ్చింది.. కాగా ఈ సినిమా తర్వాత మళ్ళీ ఈ అత్తాకోడళ్ళు ఒకే స్క్రీన్ పై కనిపించనున్నారు. వివరాల్లోకి వెళ్తే..
స్టార్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గౌతమ్ మీనన్ నాలుగు భాషల్లో ఓ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాల్లో ఉన్నాడు.. ఎడ్వెంచర్ నేపద్య కథ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ఒక హీరోగా తెలుగు నుంచి సాయి ధరం తేజ్ ను కానీ చైతు ను కానీ ఎంచుకొనున్నాడట.. కాగా మిగతా పాత్రల్లో జయం రవి, పృధ్వీరాజ్, సాయి ప్రణీత్ రాజ్ కుమార్, ను ఎంచుకొన్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా ఈ సినిమాలో అనుష్క, తమన్నా లు నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.. ఒక పెళ్లి వేడుకకు వచ్చిన నలుగురు కుర్రాళ్ళు అక్కడనుంచి అడ్వెంచర్ ట్రిప్ కి వెళతారు. అక్కడ వాళ్లకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అప్పుడు వాళ్లు ఏంచేస్తారన్నకాన్సెప్ట్ పై ఈ సినిమా తెరకెక్కనున్నట్లు.. త్వరలో అధికారిక ప్రకటన వెలువదనున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







