దుబాయ్ లో 52 మంది బిక్షగాళ్ళు పట్టివేత
- June 02, 2017
దుబాయ్: సిఐడి తనిఖీ పోలీసులు 52 మంది బిక్షగాళ్ళను దుబాయ్ లో అరెస్టు చేశారు. మే 11 వ తేదీన న ప్రారంభించిన బిక్షాటన వ్యతిరేక ప్రచారం ప్రారంభించినట్లు అందులో భాగంగా వారిని అదుపులోనికి తీసుకొన్నట్లు దుబాయ్ పోలీసు ఛీఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎఫైర్స్ అసిస్టెంట్ మేజర్ జనరల్ ఖలీల్ ఇబ్రహీం అల్ మన్సోరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దుబాయ్ లోని అన్ని ప్రాంతాలలో ఈ తనిఖీలను చేపట్టేందుకు పోలీసు తనిఖీ బృందాలు వివిధ ప్రదేశాలకు సి ఐ డి జట్లను కేటాయించారు. వీరు బహిరంగ స్థలాలు, షాపింగ్ కేంద్రాలు, మసీదులు ,నివాస ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. "మేము కేవలం కొన్ని రోజుల్లో బిచ్చగాళ్ళను నిరోధించడానికి వివిధ ప్రాంతాల్లో మరింత గస్తీ పెంచినట్లు పేర్కొన్నారు. అంతేకాక రహస్య పోలీసులు సైతం సాధారణ వ్యక్తుల మాదిరిగా పర్యవేక్షిస్తున్నారు. మేము అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన 16 మందితో సహా 52 మంది యాచకులను పట్టుకున్నామని, రంజాన్ నెలలో డబ్బు సంపాదించడానికి వారు ఇక్కడకు వచ్చినట్లు వారు స్వయంగా ఒప్పుకున్నారని మాజ్-జెన్ అల్ మన్సోరి చెప్పారు. బిచ్చగాళ్ళను అడ్డుకొని తమకు సాయపడటానికి కమ్యూనిటీకి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. "బిచ్చగాళ్ళు గురించి మాకు తెలియజేయడం ద్వారా మాకు సహాయం చేయటానికి ప్రజలు మరింత ముందుకు వస్తున్నారు, తద్వారా మేము ఆ బిక్షాటన అరెస్టు చేసి సమస్యను పరిష్కారిస్తామని అని మేజ్-జెన్ అల్ మన్సోరి ప్రకటించారు.
తాజా వార్తలు
- దిబ్బా తీరంలో తొమ్మిది మంది అరెస్టు..!!
- కువైట్ లో మహిళను జైలుపాలు చేసిన సోషల్ మీడియాలో పోస్ట్..!!
- వేసవిలో కార్మికుల భద్రతపై వీడియో వైరల్..స్పందించిన WOQOD..!!
- సౌదీ విద్యార్థి అల్-ఖస్సిం హంతకుడికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- భారతీయ వ్యక్తిని చంపిన వ్యక్తులను అరెస్ట్ చేసిన షార్జా పోలీసులు..!!
- సెక్యూరిటీ, స్టేబిలిటీపై చర్చించిన సౌదీ, బహ్రెయిన్..!!
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్









