తెలంగాణ లో ప్రపంచ తెలుగు మహాసభలకు సన్నద్ధం
- June 03, 2017
రవీంద్రభారతిని మరింత అందంగా తీర్చిదిద్దుదాం
ఈ ప్రాంగణంలోనే సాహిత్య అకాడమీ ఏర్పాటు
అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్
ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించి తగిన కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులకు సూచించారు. శనివారం రవీంద్రభారతికి వచ్చిన ముఖ్యమంత్రి అక్కడి పరిసరాలను క్షుణ్నంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఇతర అధికారులతో సాహిత్య అకాడెమీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలుగుభాషను కాపాడేందుకు, భాష ఔన్నత్యాన్ని పరిరక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని కోరారు. సాహిత్య అకాడమీ, సాంస్కృతిక శాఖ సమన్వయంతో పని చేయాలని సూచించారు. అంతకుముందు రవీంద్రభారతిని పరిశీలించి.. దీనిని మరింత అందంగా తీర్చిదిద్ది..
గొప్పగా వినియోగించుకునేందుకు అవసరమైన చర్యలు చేట్టాలని తెలిపారు. రవీంద్రభారతి కార్యాలయాన్ని (కుడివైపు గుడిసె తరహాలో ఉండేది), బుకింగ్ కేంద్రాలను కూల్చివేసి, ఆ ప్రాంతమంతా చదును చేసి, పచ్చిక బయళ్లతో సుందరీకరించి పార్కింగ్ స్థలాన్ని విస్తరించాలని అధికారులకు ఆదేశించారు. ప్రధానంగా సాహిత్య అకాడెమీ కార్యాలయాన్ని కూడా రవీంద్రభారతి ప్రాంగణంలోని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కళాభవన్ మొదటి అంతస్తులో ఉన్న ఆర్ట్ గ్యాలరీని అవసరమైతే వందమంది కూర్చునేందుకు వీలయ్యే సమావేశ మందిరంగా మారిస్తే ఎలా ఉంటుందని ఆరా తీశారు.
కళాభవన్కు డీజీపీ కార్యాలయం వైపు ఉన్న ద్వారం గుంతలా ఉందని.. వాస్తు ప్రకారం అది మంచిదికాదని వివరించారు. దాన్ని ఎలా పూరించాలో ఆలోచించాలని చెప్పినట్లు తెలిసింది. అంతకుముందు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ఇతర అధికారులతో కలిసి ముఖ్యమంత్రి ఈ సమీక్షలో పాల్గొన్నారు.
సాహిత్య అకాడెమీ ఛైర్మన్ నందిని సిధారెడ్డి, ప్రభుత్వ సలహాదారు డా॥కె.వి.రమణాచారి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, సంచాలకులు మామిడి హరికృష్ణ ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. రవీంద్రభారతి ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీలో కొలువైన బాతిక్ చిత్ర కళా ప్రదర్శనను ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపు వీక్షించారు. భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో చిత్రకారుడు యాసల ప్రకాశ్ వేసిన ఆ చిత్రాలను చూసి తెలంగాణ సంస్కృతి ఉట్టిపడుతోందని అన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









