భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగడంపై ఐసీసీ అధికారిక ప్రకటన
- June 04, 2017
మరికొన్ని గంటల్లో ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మహా సంగ్రామానికి తెరలేవనుంది. భారత్-పాకిస్థాన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురు చూసిన సమయం రానేవచ్చింది. టోర్నీలో భాగంగా టీమిండియా తన చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్తో తలపడుతుంది.
ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న దానిపై సందేహాలు తలెత్తుతున్నాయి. కారణం బ్రిటన్లో తాజాగా చేసుకున్న వరుస ఉగ్రదాడులు చోటు చేసుకోవడమే. భారత కాలమాన ప్రకారం ఆదివారం ఉదయం 4.30 నిమిషాలకు లండన్లో ఉగ్రదాడి చోటు చేసుకుంది.
తెలుపురంగు వ్యాన్లో వచ్చిన ఉగ్రవాదులు లండన్ బ్రిడ్జ్పై బోరోహ్ మార్కెట్ వద్ద దాదాపు 50 మైళ్ల వేగంతో పాదచారులను ఢీకొట్టారు. అనంతరం అదపుతప్పిన ఆ వ్యాన్ ఓ రెస్టారెంట్ వద్ద గోడను తాకి ఆగిపోయింది. దానిలో నుంచి దిగిన ముగ్గురు ఉగ్రవాదులు కత్తులతో స్వైరవిహారం చేశారు. పలువురు వ్యక్తులను దారుణంగా పొడిచి చంపారు.
రెండు చోటు ఏకకాలంలో నిర్వహించిన ఉగ్ర దాడుల్లో 30 మందికి పైగా గాయపడగా.. ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ ఉగ్రదాడిలో గాయపడిన వారిలో ఒక బ్రిటిష్ ట్రాన్స్పోర్ట్ పోలీసు అధికారి, ఎక్స్ప్రెస్ న్యూస్కు చెందిన జర్నలిస్టు కూడా ఉన్నారు.
ఈ ఉగ్రవాదుల నడుముకు పేలుడు పదార్థాలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. కాగా, ఉగ్రదాడి జరిగిన ప్రాంతం బర్మింగ్హామ్కి 208కిలోమీటర్ల దూరంలో ఉంది. ఐసీసీ ఛాంపియన్స్ టోర్నీలో భాగంగా బర్మింగ్హామ్ వేదికగా టీమిండియా తన చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్తో తలపడుతోంది.
ఛాంపియన్స్ ట్రోఫీ: భారత్-పాక్ మ్యాచ్కి వర్షం అడ్డంకి?
తాజాగా ఉగ్రదాడితో భారత్-పాక్ జరుగుతుందో లేదో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐసీసీ భారత్-పాక్ మ్యాచ్ గురించి ఓ ప్రకటన విడుదల చేసింది. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భారీ బందోబస్తు మధ్య మ్యాచ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ట్విట్టర్లో పేర్కొంది.
తాజా వార్తలు
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!









