తెలంగాణాకు ఆంధ్రప్రదేశ్ నేటి నుండి విద్యుత్ సరఫరా బంద్

- June 05, 2017 , by Maagulf
తెలంగాణాకు ఆంధ్రప్రదేశ్ నేటి నుండి విద్యుత్ సరఫరా బంద్

విద్యుత్ సరఫరాకు సంబంధించి తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలు కొండలా పేరుకు పోవడంతో ఇక ఆ రాష్ట్రానికి కరెంటు సరఫరా చేయలేమని ఆంధ్రప్రదేశ్ తేల్చి చెప్పింది. మంగళవారం నుంచి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు సోమవారం తెలంగాణ ప్రభుత్వానికి, విద్యుత్ సంస్థలకు లేఖ రాసింది. చెల్లించాల్సిన బకాయిలు చెల్లించే వరకు విద్యుత పంపిణీని నిలిపి వేస్తున్నట్లు పేర్కొంది.
విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఉత్పత్తి అయ్యే థర్మల్ విద్యుత్ లో 53.89 శాతం తెలంగాణకు, తెలంగాణలో ఉత్పత్తయ్యే థర్మల్ విద్యుత్ లో 46.11 శాతం ఏపీకి సరఫరా జరుగుతోంది. రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ పంపిణీకి సంబంధించి నెలవారీ బిల్లులు పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు. ఇప్పటివరకు రూ. 4449 కోట్ల బకాయి రూపేణా రావలసి ఉందని ఏపీ అంటోంది.
అయితే విద్యుత్ బకాయిలకు, ఆస్తి హక్కుల పంపిణీకి ముడిపెడుతూ తెలంగాణ ప్రభుత్వం, విద్యుత సంస్థలు పైసా కూడా ఇవ్వడం లేదు. ఒక వైపు తెలంగాణ నుంచి వేల కోట్ల రూపాయిలు బకాయిలు నిలిచిపోవడంతో, బకాయిలు చెల్లించాలంటూ నెలనెలా లేఖలు పంపుతూనే ఉంది. డబ్బు చెల్లించ కుంటే విద్యుత్ సరఫరా ఆపేస్తామని ఇటీవల ఘాటుగా హెచ్చరించడం తో రూ.3149 కోట్లు రూపాయిలు తాము చెల్లించాల్సి ఉందని తెలంగాణ విద్యుత సంస్థలు లిఖితపూర్వకంగా అంగీకరించాయి. పెరిగిన ధరల కారణంగా ఏపీ 1300 కోట్లు పెంచి, 5439 కోట్లు రూపాయిలు గా చూపుతోందని వాదించాయి. ఈ వాదనను ఆంధ్ర ప్రదేశ్ తోసిపుచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com