కళాకారులను ఘనంగా సత్కరించిన 'కళానిలయం'
- June 06, 2017
ప్రముఖ తెలుగు సాంస్కృతిక సంస్థ 'కళానిలయం' త్రితీయ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఉదయం ఘనంగా జరిగాయి. నవీముంబై వాషీలోని విష్ణుదాసు భావే ఆడిటోరియం లో 'ముంబై జబర్దస్త్' పేరిట నిర్వహించిన ఈ వేడుకల్లో హైదరాబాద్ కు చెందిన సినీ, టీవీ రంగాలకు చెందిన పలువురు కళాకారులు ఆడి, పాడి కార్యక్రామాన్ని రక్తి కట్టించారు. కళానిలయం చైర్ పర్సన్ పి.సుజాతరావు, హైదరాబాద్ కు చెందిన సుదీప అతిథులు, ప్రేక్షకులకు స్వాగతం పలికి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారి హర్షిత కూచిపూడి నృత్యం, 'సోల్ టు సోల్ డాన్స్ అకాడమీ' ప్రదర్శించిన గ్రూప్ డాన్స్, సినీ నేపధ్య గాయని మానసా ఆచార్య, రఘురామ్ పాటలు, జబర్దస్త్ బృందం రచ్చ రవి, ఆడి కిరణ్ ఆట పాటలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. అనంతరం వివిధ రంగాలలోని ప్రముఖుల్ని కళానిలయం తొలిసారిగా ప్రవేశపెట్టిన 'కళానిలయం' అవార్డును ప్రదానం చేశారు. అవార్డు అందుకున్నవారిలో ప్రముఖ రచయత సిరాశ్రీ (సాహిత్య సుధా), దర్శకుడు రామ్ భీమన (విశిష్ట ప్రతిభ), నటి సుభాషిణి (కళారత్న), కూచిపూడి నాట్య కళాకారిణి శైలజా దేశాయ్ (కళానిధి), ప్రముఖ బహుభాషా వ్యాఖ్యాత టి.చలపతిరావు (కళాకోవిద), ప్రముఖ నాట్య కళాకారిణి మేరీ మ్యాక్ మోహన్ పాల్ ను జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు. కార్యక్రమంలో కళానిలయం నిర్వాహకులు పాటి బండ్ల సుధాకరరావు, కమిటీ సభ్యులతోపాటు నగరంలోని ప్రముఖులు, తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.




తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







