'గల్ఫ్' అవగాహనా యాత్ర పోస్టర్ ఆవిష్కరణ
- June 06, 2017
ప్రముఖ దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం గల్ఫ్ వచ్చే నెల జులై లో విడుదలకి సిద్ధం అవుతోంది. ఈ లోగా చిత్ర నిర్మాతలు గల్ఫ్ చిత్రం ప్రచారం మొదలుపెట్టారు. చిత్ర నిర్మాతలు గల్ఫ్ అవగాహనా యాత్ర పోస్టర్ ని సిరిసిల్ల జిల్లా లో విడుదల చేసారు.
జిల్లా ఎస్పీ కుంపటి విశ్వజిత్ గల్ఫ్ అవగాహనా యాత్ర పోస్టర్ ని విడుదల చేయగా, చిత్ర దర్శక నిర్మాతలు తమ గల్ఫ్ చిత్రం గురించి వివరించారు. ఈ చిత్రం లో గల్ఫ్ లో ప్రవాస భారతీయలు ఉపాధి కోసం వెళ్లి ఏ విధంగా కష్ట నష్టాలని ఓర్చుకొని జీవితం వెళ్లదీస్తున్నారో సవివరంగా చూపెట్టమని చెప్పారు.
దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 9 వ తేదీన సిరిసిల్ల లో చిత్ర నటీ నటులు మరియు సాంకేతిక నిపుణులు పాల్గొంటారని తెలిపారు. పోస్టర్ విడుదల కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాపి రాజు, గల్ఫ్ చిత్రం తెలంగాణ అంబాసడర్ చీటి సతీష్ బాబు, భూమా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం
- దుబాయ్లో టాక్సీ డ్రైవర్ ఉద్యోగాలు..ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే ఈ నెంబర్ కు కాల్ చేయండి!
- ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు పూర్తి
- ఎస్ఆర్ స్కూల్స్ లో శిఖార్ వినూత్న విద్యా కార్యక్రమం ఘనంగా ప్రారంభం
- రూ.5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్ పోలీసుల అడ్డుకట్ట
- కువైట్ గగనతలంలో 24 శత్రు డ్రోన్లను అడ్డుకున్న సాయుధ దళాలు
- ‘వికసిత్ భారత్’ దిశగా AM/NS ఇండియా–బిట్స్ పిలానీ భాగస్వామ్యం









