గుంటూరు నుండి గల్ఫ్ దేశాలకు సెక్స్ రాకెట్...
- June 06, 2017
గుంటూరు నుండి గల్ఫ్ దేశాలకు సెక్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది.నిరుపేద అమ్మాయిలను టార్గెట్గా చేసుకుని గల్ఫ్కు తరలిస్తుందో ముఠా. వేలకు వేలు జీతం ఇచ్చే ఉద్యోగం అంటూ మభ్యపెట్టి.. అరబ్ దేశాల్లో మాత్రం క్లబ్ డ్యాన్సర్లుగా.. సెక్స్వర్కర్లుగా మార్చేస్తోంది. ఎంతోకాలంగా సాగుతున్న ఈ దందా.. ఇప్పుడు ఓ వ్యక్తి చొరవతో బయటపడింది.
నరసారావుపటేలోని పెద్దచెరువు ప్రాంతంలో నివాసం ఉంటున్న కనకం బంధువు హరి.. చెన్నై నుంచి తరచూ వస్తుండేవాడు. అరబ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ.. పెద్ద చెరువు ప్రాంతంలో చాలా మంది అమ్మాయిలను ప్రలోభపెట్టాడు. అతని బుట్టలో పడిన దాదాపు 10 మంది అమ్మాయిలను నకిలీ సర్టిఫికెట్లు పెట్టి UAEకి పంపించాడు. ఇందులో చెన్నైకి చెందిన అస్కర్ అలీ కీలక పాత్ర పోషించాడు. షాపింగ్ కాంప్లెక్స్ల్లో ఉద్యోగాలు వస్తాయని చెప్పిన అతను.. తీరా అక్కడికి తీసుకువెళ్లిన తర్వాత.. హోటళ్లు, పబ్లలో డ్యాన్సర్లుగా మార్చాడు. మరికొంతమంది మందిని సెక్స్ ముఠాలకు అప్పగించాడు. అప్పులు చేసి రావడం, అక్కడ ఆదుకునే వాళ్లు ఎవరూ లేకపోవడంతో.. గత్యంతరం లేక వారంతా.. అతడు చెప్పినట్లు చేయాల్సి వస్తోంది. తమకు ఇష్టం లేకపోయినా నరకాన్ని అనుభవిస్తున్నారు.
ఇలా సెక్స్ ముఠాల చేతుల్లో చిక్కిన ఓ యువతి.. UAEలో పనిచేస్తున్న నరసరావుపేట వాసి షరీఫ్కు పరిచయం అయ్యింది. తన బాధను చెప్పి.. కాపాడమని కోరుకుంది. ఆమెను వదలాలంటే.. డబ్బు కట్టాల్సిందేనంటూ కరాఖండీగా చెప్పారు వ్యభిచారముఠా నిర్వాహకులు. దీంతో.. స్నేహితులతో కలిసి కొంత డబ్బును చెల్లించిన తర్వాత వాళ్లు బెదిరింపులకు దిగారు. అమ్మాయిని విడుదల చేయమని.. ఎవరికైనా చెప్పుకోమని తెగేసి చెబుతున్నాడు బ్రోకర్ అలీ. ఇక్కడి ప్రభుత్వం స్పందించి చొరవ తీసుకుంటే తప్ప.. నరసరావుపేట అమ్మాయిలకు విముక్తి లభించదంటున్నాడు షరీఫ్.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









